డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ రాంనగర్లోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాకేష్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్, సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆ బాధ్యత ఒక్క ఉపాధ్యాయులదే..
విశ్రాంత ఉపాధ్యాయులు సంజీవ్ కుమార్, ఆక్స్ఫర్డ్ స్కూల్ ఛైర్మన్ ఉప్పు లింగయ్య, గాయత్రి స్కూల్ ఛైర్మన్ శ్రీనివాస్ను సన్మానించారు. విద్యార్థులను మంచి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఒక్క ఉపాధ్యాయులదేనని రాకేశ్ తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రమేష్, జిల్లా కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షులు మంథని కిరణ్, పెంట శ్రీనివాస్, జిల్లా బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్, బీసీ విద్యార్థి సంఘం అధికార ప్రతినిధి మహేష్, బీసీ నాయకులు మిల్క్ ఉరి సతీష్, ఎస్కే జాంగిర్ పాషా, పవన్ కుమార్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ద్వారా వైద్యం అందించాలి: టీఎన్జీవో