కరీంనగర్ జిల్లాలో కరోనా మహమ్మారి బారినపడి కుటుంబ సభ్యులను కోల్పోయిన పలువురికి ఆదరణ సేవా సమితి, సర్వ్ టు సోసైటీలు అండగా నిలిచాయి. జిల్లాలోని రామడుగు, కొత్తపల్లి మండలాల్లోని కొవిడ్ బాధిత కుటుంబాలకు నిత్యవసర వస్తువులను ఆ సంస్థల సభ్యులు పంపిణీ చేశారు.
జిల్లాలోని రామడుగు మండలం తిర్మాపూర్ గ్రామంలో కరోనా కారణంగా కుటుంబాన్ని కోల్పోయి అనాథగా మారిన బాలికకు అండగా నిలిచారు. బాలికకు మూడు నెలలకు సరిపడా నిత్యవర వస్తువులను ఆ సంస్థల సభ్యులు అందజేశారు.
కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామానికి చెందిన కారు డ్రైవర్ మృతి చెందడంతో అతని భార్యా పిల్లలకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని, సర్వ్ టు సోసైటీ అధ్యక్షుడు శశాంక్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: RAITHUBANDHU: ఎల్లుండి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు