రుతుపవనాలు రాకముందే కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడి పోయింది. వేసవి కాలంలో ఉక్కపోతతో సతమతమవుతున్న కరీంనగర్ నగరవాసులకు.. చిరుజల్లులు ఉపశమనం కలిగించాయి. వేకువజాము నుంచే కరీంనగర్ నగరంలో చిరుజల్లులు పడుతున్నాయి. వాతావరణం చల్లబడటంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
రుతుపవనాల రాకతో ఏసీల, కూలర్ల మోత తగ్గనుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడటంతో నగరవాసుల్లో ఉత్సాహం నెలకొంది.
ఇదీ చూడండి: 'కరోనా దోపిడీ' బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పిస్తారా?