ETV Bharat / state

జిలుగు సాగును సందర్శించిన మంత్రి ఈటల రాజేందర్​

author img

By

Published : Jun 20, 2020, 7:33 PM IST

పంటల సాగులో సేంద్రీయ ఎరువుల వాడకంపై రైతులు దృష్టి సారించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఇప్పల నర్సింగాపూర్‌లో జిలుగు సాగును జిల్లా కలెక్టర్​ శంశాక, ఎమ్మెల్యే సతీష్​ కుమార్​లతో కలిసి సందర్శించారు.

Minister Etela Visits Jeeluga Farm In huzurabad
జిలుగు సాగును సందర్శించిన మంత్రి ఈటల రాజేందర్​

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ మున్సిపాలిటీ పరిధిలోని జిలుగు సాగును మంత్రి ఈటల రాజేందర్​ సందర్శించారు. జిలుగు సాగు వల్ల కలిగే లాభాలను రైతులకు వ్యవసాయ అధికారులు మంత్రి సమక్షంలో వివరించారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు.. జిల్లా కలెక్టర్​, ఎమ్మెల్యే సతీష్​ కూమార్​ కూడా ఉన్నారు. అధిక మోతాదులో రసాయన ఎరువులు, క్రిమి సంహారక ఎరువులు వాడకూడదని మంత్రి సూచించారు.

జిలుగు సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గటమే కాకుండా భూమికి పోషకాలు కూడా అందుతాయని ఆయన తెలిపారు. క్లస్టర్ల వారిగా రైతు వేదికలను నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, ఆర్డీవో బెన్‌షలోమ్‌, ఏడిఏ ఆదిరెడ్డి, ఏవో సునీల్‌, తహశీల్దార్‌ బావుసింగ్‌, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ మున్సిపాలిటీ పరిధిలోని జిలుగు సాగును మంత్రి ఈటల రాజేందర్​ సందర్శించారు. జిలుగు సాగు వల్ల కలిగే లాభాలను రైతులకు వ్యవసాయ అధికారులు మంత్రి సమక్షంలో వివరించారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు.. జిల్లా కలెక్టర్​, ఎమ్మెల్యే సతీష్​ కూమార్​ కూడా ఉన్నారు. అధిక మోతాదులో రసాయన ఎరువులు, క్రిమి సంహారక ఎరువులు వాడకూడదని మంత్రి సూచించారు.

జిలుగు సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గటమే కాకుండా భూమికి పోషకాలు కూడా అందుతాయని ఆయన తెలిపారు. క్లస్టర్ల వారిగా రైతు వేదికలను నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, ఆర్డీవో బెన్‌షలోమ్‌, ఏడిఏ ఆదిరెడ్డి, ఏవో సునీల్‌, తహశీల్దార్‌ బావుసింగ్‌, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్​ గన్​మెన్​కు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.