ETV Bharat / state

హరిత విప్లవకారుడు కేసీఆర్​: మంత్రి ఈటల - Latest news in Telangana

కరీంనగర్​ జిల్లాలో నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు.

హరిత విప్లవానికి నాంది పలికిన నాయకుడు కేసీఆర్​: మంత్రి ఈటల
హరిత విప్లవానికి నాంది పలికిన నాయకుడు కేసీఆర్​: మంత్రి ఈటల
author img

By

Published : Feb 17, 2021, 2:09 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండి.. రాష్ట్ర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని మంత్రి ఈటల రాజేందర్​ ఆకాంక్షించారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు.

హుజూరాబాద్ మున్సిపాలిటీలో నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ముందుగా కేక్​ కట్​ చేసి... మిఠాయిలు పంపిణీ చేశారు. మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. మండలంలోని కాట్రపల్లి, తుమ్మనపల్లి గ్రామాల్లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మొక్కలను నాటారు. మిఠాయిలను పంపిణీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జన్మదిన వేడుకలను తెరాస నాయకులు, కార్యకర్తలు జరుపుకుంటున్నారని తెలిపారు. దేశంలో హరిత విప్లవానికి నాంది పలికిన నాయకుడు కేసీఆర్ అని వెల్లడించారు.

ఇదీ చదవండి: కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి: మోదీ

ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండి.. రాష్ట్ర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని మంత్రి ఈటల రాజేందర్​ ఆకాంక్షించారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు.

హుజూరాబాద్ మున్సిపాలిటీలో నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ముందుగా కేక్​ కట్​ చేసి... మిఠాయిలు పంపిణీ చేశారు. మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. మండలంలోని కాట్రపల్లి, తుమ్మనపల్లి గ్రామాల్లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మొక్కలను నాటారు. మిఠాయిలను పంపిణీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జన్మదిన వేడుకలను తెరాస నాయకులు, కార్యకర్తలు జరుపుకుంటున్నారని తెలిపారు. దేశంలో హరిత విప్లవానికి నాంది పలికిన నాయకుడు కేసీఆర్ అని వెల్లడించారు.

ఇదీ చదవండి: కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.