కరీంనగర్ జిల్లా గన్నేరువరం, జంగపల్లి, హన్మాజిపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభించారు. దళారుల నుంచి రైతులు విముక్తి పొందడానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. రైతులు ఈ సేవలను సద్వినియోగం చేసుకుంటూ అధిక దిగుబడులు పొందాలని సూచించారు. మద్దతు ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు.
- ఇదీ చూడండి : గ్యాస్ సిలిండర్ పేలి రైల్లో మంటలు... 65 మంది మృతి