ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లాక్డౌన్ విజయవంతంగా అమలవుతోంది. కరీంనగర్ జిల్లాలో 19 కరోనా కేసులు నమోదవగా 17 మంది కోలుకున్నారు. ఇద్దరు చికిత్స పొందుతున్నారు. నగరంలోని సాహిత్ నగర్, శర్మ నగర్ లను మాత్రమే కంటైన్మెంట్ జోన్లుగా కొనసాగిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 3 కొవిడ్ కేసులకు గానూ ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 5ఏళ్ల బాలుడు మాత్రమే చికిత్స పొందుతున్నాడు. కోరుట్ల, కల్లూరు లలో కంటైన్మెంట్ జోన్లను తొలగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముగ్గురు చికిత్స పొందుతుండగా సుమారు 1000 మంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. వేములవాడ పట్టణంలోని సిద్దార్థనగర్ను కంటైన్మెంట్ జోన్గా కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం