కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన సమ్మయ్య కడుపునొప్పితో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ అర్ధాంతరంగా మృతి చెందాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అంతా బాగానే ఉందని చెప్పారని.. డిశ్చార్జ్ చేయాల్సిన సమయానికి సమ్మయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కడుపు నొప్పి బాధతో ఆసుపత్రికి తీసుకు వస్తే శవాన్ని అప్పజెప్పారని మృతుడి అల్లుడు ఆవేదన చెందాడు. ఆసుపత్రి యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ప్రయాణం ప్రయాసే... జనమెక్కువ వాహనాలు తక్కువ!