ETV Bharat / state

వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

కరీంనగర్ జిల్లా పాలనాధికారి శశాంక శంకరపట్నం మండలం కేంద్రంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

author img

By

Published : Apr 18, 2020, 8:37 PM IST

COLLECTOR SHASHANKA VISITED PADDY CENTRES
వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలంలో జిల్లా పాలనాధికారి శశాంక పర్యటించారు. అందులో భాగంగానే శంకరపట్నం టీసెర్ప్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. డీఆర్డీవో పీడీ వెంకటేశ్వర్‌ రావు, కేంద్రం నిర్వాహకులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు, హమాలీ కార్మికులతో మాట్లాడారు. కొనుగోలు తీరును అడిగి తెలుసుకున్నారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్రం వద్ద తప్పకుండా శానిటైజర్లు, మాస్కులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. శంకరపట్నం మండలం తాడికల్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు కనీస మౌళిక వసతులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ శశాంక అన్నారు.

కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలంలో జిల్లా పాలనాధికారి శశాంక పర్యటించారు. అందులో భాగంగానే శంకరపట్నం టీసెర్ప్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. డీఆర్డీవో పీడీ వెంకటేశ్వర్‌ రావు, కేంద్రం నిర్వాహకులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు, హమాలీ కార్మికులతో మాట్లాడారు. కొనుగోలు తీరును అడిగి తెలుసుకున్నారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్రం వద్ద తప్పకుండా శానిటైజర్లు, మాస్కులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. శంకరపట్నం మండలం తాడికల్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు కనీస మౌళిక వసతులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ శశాంక అన్నారు.

ఇవీ చూడండి: కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.