కరీంనగర్లో ఈనెల 17న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని డాక్టర్ విజయేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సదస్సులో వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు.
సదస్సుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, స్థానిక ఎంపీ బండి సంజయ్కుమార్ హాజరుకానున్నారని తెలిపారు. సదస్సులో ఐఎమ్ఏ రాష్ట్ర అధ్యక్షున్ని ప్రకటించనున్నామని వెల్లడించారు. ఈ సదస్సు వైద్యులతో పాటు పీజీ చేస్తున్న వైద్య విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని... విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి : ఆర్టీసీ విలీనానికి "తాత్కాలిక" విరామం..!