పార్లమెంట్ ఎన్నికల్లో అనవసరంగా భాజపా ఓటేశామని చాలా మంది బాధపడుతున్నారని బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్ అభిప్రాయపడ్డారు. కరీంనగర్లో పలువురు నాయకులు ఇతర పార్టీల నుంచి తెరాసలోకి చేరిన సందర్భంగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున తెరాసలో చేరేందుకు పోటీ పడుతున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. పదవుల కోసం అయితే పార్టీలోకి రావద్దని..పార్టీని బలపరిచేందుకు మాత్రమే రావాలని కోరుతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.