పట్టణాలకు దీటుగా పల్లెలు ప్రగతి సాధించేలా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. 30రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం గ్రామపంచాయతీల అవసరాలను గుర్తించి అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 19 ట్రాక్టర్లను ఆయా గ్రామపంచాయతీలకు పంపిణీ చేశారు.
ఆయా గ్రామాలకు ట్రాక్టర్ల పంపిణీకి కోటి 64లక్షల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా గ్రామాల్లో కొత్తగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయటంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి జరిగితే గ్రామాల నుంచి పట్టణాలకు కాకుండా పట్టణాల నుంచి గ్రామాలకు వలసలు పెరుగుతాయని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు.
ఇదీ చూడండి: బంగారు టాయ్లెట్ను దొంగలెత్తుకెళ్లారు..!