ETV Bharat / state

పట్నాల నుంచి పల్లెలకు వలసలు

author img

By

Published : Dec 10, 2019, 3:34 PM IST

పల్లెల నుంచి పట్టణాలకు వలసలు సర్వసాధారణం. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పట్టణాల నుంచి పల్లెలకు వలసలు పెరుగుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. 30రోజుల ప్రణాళికలో భాగంగా కరీంనగర్​లో వివిధ గ్రామ పంచాయతీలకు 19ట్రాక్టర్లను పంపిణీ చేశారు.

gangula-kamalakar-tractors-distribution-in-karimnagar-district
పట్నాల నుంచి పల్లెలకు వలసలు

పట్టణాలకు దీటుగా పల్లెలు ప్రగతి సాధించేలా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. 30రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం గ్రామపంచాయతీల అవసరాలను గుర్తించి అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 19 ట్రాక్టర్లను ఆయా గ్రామపంచాయతీలకు పంపిణీ చేశారు.

ఆయా గ్రామాలకు ట్రాక్టర్ల పంపిణీకి కోటి 64లక్షల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా గ్రామాల్లో కొత్తగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం వేలాడుతున్న విద్యుత్‌ తీగలను సరిచేయటంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి జరిగితే గ్రామాల నుంచి పట్టణాలకు కాకుండా పట్టణాల నుంచి గ్రామాలకు వలసలు పెరుగుతాయని మంత్రి గంగుల కమలాకర్‌ వివరించారు.

పట్నాల నుంచి పల్లెలకు వలసలు

ఇదీ చూడండి: బంగారు టాయ్​లెట్​ను దొంగలెత్తుకెళ్లారు..!

పట్టణాలకు దీటుగా పల్లెలు ప్రగతి సాధించేలా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. 30రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం గ్రామపంచాయతీల అవసరాలను గుర్తించి అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 19 ట్రాక్టర్లను ఆయా గ్రామపంచాయతీలకు పంపిణీ చేశారు.

ఆయా గ్రామాలకు ట్రాక్టర్ల పంపిణీకి కోటి 64లక్షల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా గ్రామాల్లో కొత్తగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం వేలాడుతున్న విద్యుత్‌ తీగలను సరిచేయటంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి జరిగితే గ్రామాల నుంచి పట్టణాలకు కాకుండా పట్టణాల నుంచి గ్రామాలకు వలసలు పెరుగుతాయని మంత్రి గంగుల కమలాకర్‌ వివరించారు.

పట్నాల నుంచి పల్లెలకు వలసలు

ఇదీ చూడండి: బంగారు టాయ్​లెట్​ను దొంగలెత్తుకెళ్లారు..!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.