నీటి వృథాను అరికట్టడం, వాన నీటిని సంరక్షించడంపై అవగాహన కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ జిల్లాలో స్వ శక్తి సంఘ మహిళలకు మూడు రోజలు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ప్రతిరోజు ఇళ్లలో వినియోగించే నీటిని వృథాగా వదిలేయకుండా భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాన నీటిని సంరక్షించేందుకు సామాజిక బాధ్యతగా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సూచించారు. మహిళా రైతులు తమ పంట పొలాల్లో కందకాలు తవ్వించాలని సూచించారు. ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడడం ద్వారా భవిష్యత్లో నీటి కష్టాలు రాకుండా నివారించవచ్చని గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వెంకటేశ్వరరావు తెలిపారు
ఇవీ చూడండి: తడిసి ముద్దయిన భాగ్యనగరం