ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తనవంతు ప్రయత్నిస్తానని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇందిరానగర్లో 25 లక్షల వ్యయంతో నిర్మించిన అంబేడ్కర్ మెమోరియల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. భవనానికి అవసరమైన హంగులు సమకూర్చడానికి మరో 20లక్షలు రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజకీయ జీవితం ఇందిరానగర్ నుంచే ప్రారంభమైందని... కార్పొరేటర్ నుంచి మంత్రి స్థాయికి చేరుకున్నానని గుర్తు చేసుకున్నారు.
ఇదీ చూడండి: 'బుల్లెట్ రైలు అంటే దిల్లీ, ముంబయిలేనా.. హైదరాబాద్ గుర్తుకు రాదా'