కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ గాంధీ చౌక్ వద్ద ప్లాస్టిక్ వాడబోమంటూ ప్రతిజ్ఞ చేశారు. జిల్లాలోని పలు గ్రామాలతో పాటు కళ్యాణి గ్రామంలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ చేపట్టారు. అంతకుముందు ఎల్లారెడ్డి గాంధీ చౌక్ వద్ద ఎమ్మెల్యే జాజాల సురేందర్ గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఇవీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్ ఘన నివాళి