నిజామాబాద్లోని ఆర్మూర్ పట్టణానికి చెందిన నారాయణ, లక్ష్మీ వృద్ధ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా... ఇద్దరూ జైల్లోనే ఉన్నారు. దీంతో పోషించేవారు లేక... బతుకుదెరువు కోసం ఉపాధి వెతుక్కుంటూ మెదక్ జిల్లాలోని అక్కన్నపేట్లో పనికి కుదిరారు. ఈ క్రమంలోనే నారాయణకు మెడపై పెద్ద కణతి ఏర్పడింది.
చికిత్స కోసం రామాయంపేట్ వెళ్లగా అక్కడ వైద్యులు చికిత్స చెయ్యలేమని తెలిపారు. అనంతం ప్రభుత్వ అంబులెన్స్లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. కానీ ఇక్కడ పట్టించుకునే నాథుడే లేకపోవడంతో చేసేదేమి లేక ఎండలోనే పడిగాపులు కాసి... వైద్యుల వద్దకు వెళ్లగా... నిజామాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. నివ్వెరపోయిన దంపతులు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చూడండి: మరో 100రోజుల వరకు కరోనా ముప్పు: వైద్యులు