ETV Bharat / state

కామారెడ్డి1.. నిజామాబాద్‌8 - Kamareddy district first place in implementation of Employment Guarantee Scheme

లాక్‌డౌన్‌ కూలీల కడుపు మాడుస్తుంటే.. ఉపాధి హామీ పథకం ఊరటనిస్తోంది. పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పనుల గుర్తింపు, ఉపాధి కల్పించడంలో రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా.. నిజామాబాద్‌ జిల్లా ఎనిమిదో స్థానంలో ఉంది. అధికారులు జలసంరక్షణ పనులకు ప్రాధాన్యమిస్తున్నారు.

Employment Guarantee Scheme latest news in kamareddy district
Employment Guarantee Scheme latest news in kamareddy district
author img

By

Published : May 1, 2020, 12:41 PM IST

పట్టణాలతో పాటు గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన వారు ఉపాధి పనులకు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తమకు జాబ్‌కార్డులు మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. అడిగిన ప్రతిఒక్కరికి అందించే విధంగా చర్యలు చేపడితే కష్టకాలంలో కూలీలకు ఆసరా లభిస్తుంది. ఇదే విధంగా రెండుమూడేళ్లుగా వినియోగించని జాబ్‌కార్డులను క్రియాశీలంగా మార్చాలని అధికారులకు విన్నవిస్తున్నా మండలాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మరో నెల రోజులు పనులు కొనసాగేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని కూలీలు కోరుతున్నారు.

మస్టర్ల నమోదులో జాప్యం...

కూలీల హాజరును నమోదు చేయడమే కాకుండా... వారు చేసిన పనిని కొలిచేందుకు అవసరమైన సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. మస్టర్ల నమోదులో జాప్యం కారణంగా కొన్ని ప్రాంతాల్లో వారంలో రెండు రోజులు పనులు నిలిపివేస్తున్నారు.

కొరవడిన జాగ్రత్తలు...

కూలీలు సామాజిక దూరం పాటించేలా చూడడంతోపాటు పనులను దూరంగా గుర్తించాలని నిబంధనలున్నా... క్షేత్రస్థాయి సిబ్బంది పనిఒత్తిడితో పట్టించుకోవడం లేదు. కూలీలందరికి మాస్కులు పంపిణీ చేయాల్సిన ఉన్నా నామమాత్రంగా అందిస్తున్నారు.

నిబంధనల మేరకు పనులు...

పని ప్రదేశాల్లో కూలీలు నిబంధనలు పాటించాలన్నారు కామారెడ్డి గ్రామీణాభివృద్ధి అధికారి చంద్రమోహన్‌రెడ్డి. మాస్కు ధరించడమే కాకుండా... సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో తాగునీరు వెంట తెచ్చుకోవాలన్నారు. కొత్త జాబ్‌కార్డు కావాలన్నా, పాత వాటిని క్రియాశీలంగా మార్చాలన్నా ఎంపీడీవోకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

పట్టణాలతో పాటు గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన వారు ఉపాధి పనులకు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తమకు జాబ్‌కార్డులు మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. అడిగిన ప్రతిఒక్కరికి అందించే విధంగా చర్యలు చేపడితే కష్టకాలంలో కూలీలకు ఆసరా లభిస్తుంది. ఇదే విధంగా రెండుమూడేళ్లుగా వినియోగించని జాబ్‌కార్డులను క్రియాశీలంగా మార్చాలని అధికారులకు విన్నవిస్తున్నా మండలాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మరో నెల రోజులు పనులు కొనసాగేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని కూలీలు కోరుతున్నారు.

మస్టర్ల నమోదులో జాప్యం...

కూలీల హాజరును నమోదు చేయడమే కాకుండా... వారు చేసిన పనిని కొలిచేందుకు అవసరమైన సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. మస్టర్ల నమోదులో జాప్యం కారణంగా కొన్ని ప్రాంతాల్లో వారంలో రెండు రోజులు పనులు నిలిపివేస్తున్నారు.

కొరవడిన జాగ్రత్తలు...

కూలీలు సామాజిక దూరం పాటించేలా చూడడంతోపాటు పనులను దూరంగా గుర్తించాలని నిబంధనలున్నా... క్షేత్రస్థాయి సిబ్బంది పనిఒత్తిడితో పట్టించుకోవడం లేదు. కూలీలందరికి మాస్కులు పంపిణీ చేయాల్సిన ఉన్నా నామమాత్రంగా అందిస్తున్నారు.

నిబంధనల మేరకు పనులు...

పని ప్రదేశాల్లో కూలీలు నిబంధనలు పాటించాలన్నారు కామారెడ్డి గ్రామీణాభివృద్ధి అధికారి చంద్రమోహన్‌రెడ్డి. మాస్కు ధరించడమే కాకుండా... సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో తాగునీరు వెంట తెచ్చుకోవాలన్నారు. కొత్త జాబ్‌కార్డు కావాలన్నా, పాత వాటిని క్రియాశీలంగా మార్చాలన్నా ఎంపీడీవోకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.