కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్పేటలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న మచ్చేందర్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
శంకరపేట మండలం కమలాపురానికి చెందిన మచ్చేందర్...చెల్లెలు, తమ్ముడితో కలిసి అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు. ఈరోజు ఉదయం నీళ్లు పట్టేందుకు మోటర్ ఆన్ చేస్తుండగా... విద్యుదాఘాతానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా.. మృతి చెందాడు.
ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై శ్వేత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చూడండి: తూటా ఏ తుపాకిది? ఎవరు కాల్చారు? ఎవరికి తాకింది?