జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల 34వ గేటు వద్ద సాంకేతిక సమస్యతో గేటు నుంచి నీరు లీకేజ్ అవుతోంది. వారం రోజుల నుంచి నీరు వృథాగా పోతున్నది. ఈ విషయంపై మెకానికల్ ఏఈ విజయ్ కుమార్ని సంప్రదించగా జలాశయ నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉన్నందున నీటి ఒత్తిడి అధికంగా ఉందని తెలిపారు. అక్కడ మరమ్మతులు చేపట్టేందుకు సమయం పడుతుందని వెల్లడించారు.
ఇవీ చూడండి: ఈ శివుడి చేతిలో... ప్రాణం పోసుకున్న గణనాథులెందరో!