జోగులంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం పెద్దపాడులో ఎమ్మెల్యే కృష్టమోహన్ పర్యటించారు. రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామం, శాంటిగ్రేషన్షెడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. మనిషి జన్మించిన తర్వాత చేరుకొనే చివరి పుణ్యస్థలమే వైకుంఠధామమని ఎమ్మెల్యే అభివర్ణించారు. 50 ఏళ్లు కాంగ్రెస్... 20 ఏళ్లు తెదేపా పాలించినా... కనీసం గ్రామాల్లో వైకుంఠధామలను కూడా నిర్మించలేరని మండిపడ్డారు.
రైతులకు, మహిళలకు తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వివరించారు. సంక్షేమ పథకాలు అమలుచేస్తూ... రైతుల పక్షపాతిగా నిలిచిన కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.