ETV Bharat / state

కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

తెలంగాణలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు సీఎం కేసీఆర్​ అండగా ఉంటున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు.

author img

By

Published : Aug 28, 2020, 5:30 PM IST

gadwal mla kalyanalaxmi, shadhi mubarak cheques distribution in jogulamba gadwal district
కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 135 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పంపిణీ చేశారు. తెలంగాణలో ఉన్న ప్రతి పేదింటి ఆడబిడ్డకు సీఎం కేసీఆర్​ అండగా ఉంటున్నారని ఆయన అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటివని ఎమ్మెల్యే తెలిపారు.

రైతులకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల వల్ల ఎంతో లబ్ధి చేకూరుతోందని ఆయన అన్నారు. గతంలో ఏ నాయకులు చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బీఎస్ కేశవ్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 135 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పంపిణీ చేశారు. తెలంగాణలో ఉన్న ప్రతి పేదింటి ఆడబిడ్డకు సీఎం కేసీఆర్​ అండగా ఉంటున్నారని ఆయన అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటివని ఎమ్మెల్యే తెలిపారు.

రైతులకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల వల్ల ఎంతో లబ్ధి చేకూరుతోందని ఆయన అన్నారు. గతంలో ఏ నాయకులు చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బీఎస్ కేశవ్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 'సాగునీటి కల్పనపై జీవన్​రెడ్డి వ్యాఖ్యలు అవాస్తవం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.