జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మీర్జాపూరం వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ జరిపారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ భాజపా పార్టీ కార్యాలయం నుంచి కృష్ణవేణి చౌక్ వరకు ప్రదర్శన చేశారు.
గతంలో సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించాలని నలుగురు సీఎంలను కోరారని భాజపా జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి అన్నారు. గత నలుగురు ముఖ్యమంత్రులను ఆ విషయంలో డిమాండ్ చేశారని ఆయన గుర్తుచేశారు.
ఇదీ చూడండి : స్వీయ నిర్బంధంలోకి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్