ETV Bharat / state

చిన జాతరపై చిన్నచూపు

మేడారం చినజాతరకు సమయం దగ్గర పడుతోంది. ఏటా లక్షల్లో వచ్చే భక్తులకు సదుపాయాలు కరవయ్యాయి.

author img

By

Published : Feb 5, 2019, 5:31 PM IST

Updated : Feb 5, 2019, 6:48 PM IST

మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు

మేడారం చినజాతర
మేడారం చిన జాతర ఈ నెల 20 నుంచి నాలుగు రోజుల పాటు జరనుంది. భక్తుల రాక ఇప్పటికే మొదలైంది. ఏర్పాట్లపై మాత్రం అధికారులు పెద్దగా దృష్టి సారించట్లేదు. తాగునీరు, స్నానఘట్టాల వద్ద సరైన ఏర్పాట్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద జాతర జరిగిన మరుసటి సంవత్సరం చిన్నజాతర నిర్వహించటం ఆనవాయితీ. దీనిని 'మండమెలిగే' పండుగగా వ్యవహరిస్తారు.
undefined
వన దేవతల ఆగమనం లేకపోయినా సమ్మక్క, సారలమ్మ ఆలయాల చెంత శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తారు. రాత్రి పూట జాగారాలు చేస్తూ... నాలుగు రోజులు వైభవంగా నిర్వహిస్తారు. గత రెండేళ్ల నుంచి చిన్న జాతరకొచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఈ ఏడాది మూడు నుంచి నాలుగు లక్షల వరకు భక్తులు దర్శించుకుంటారని అంచనా. సర్వీసులు పెంచేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఆది, బుధవారాల్లో హన్మకొండ నుంచి అదనపు బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు.

మేడారం చినజాతర
మేడారం చిన జాతర ఈ నెల 20 నుంచి నాలుగు రోజుల పాటు జరనుంది. భక్తుల రాక ఇప్పటికే మొదలైంది. ఏర్పాట్లపై మాత్రం అధికారులు పెద్దగా దృష్టి సారించట్లేదు. తాగునీరు, స్నానఘట్టాల వద్ద సరైన ఏర్పాట్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద జాతర జరిగిన మరుసటి సంవత్సరం చిన్నజాతర నిర్వహించటం ఆనవాయితీ. దీనిని 'మండమెలిగే' పండుగగా వ్యవహరిస్తారు.
undefined
వన దేవతల ఆగమనం లేకపోయినా సమ్మక్క, సారలమ్మ ఆలయాల చెంత శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తారు. రాత్రి పూట జాగారాలు చేస్తూ... నాలుగు రోజులు వైభవంగా నిర్వహిస్తారు. గత రెండేళ్ల నుంచి చిన్న జాతరకొచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఈ ఏడాది మూడు నుంచి నాలుగు లక్షల వరకు భక్తులు దర్శించుకుంటారని అంచనా. సర్వీసులు పెంచేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఆది, బుధవారాల్లో హన్మకొండ నుంచి అదనపు బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు.
Intro:TG_KRN_101_05_MIDDAY MEALS_TEACHERS CARING_PKG_C11
FROM:KAMALAKAR HUSNABAD C11
---------------------------------------------------------------------------- సిద్దిపేట్ జిల్లా హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(1-5 వ తరగతి) లోని ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని, నాణ్యమైన విద్యతోపాటు, విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ, విద్యార్థులకు తినిపిస్తూ ఆహారం వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, తల్లిదండ్రుల ప్రశంస పొందుతూ పాఠశాల అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నారు. పాఠశాలలో 2016 వ సంవత్సరం వరకు 45 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. గత రెండు సంవత్సరాల నుండి ఉపాధ్యాయులు ఏప్రిల్ మే నెలల్లో "మన ఊరు మనబడి" కార్యక్రమం చేపట్టి గ్రామంలోని ఇంటింటికి తిరిగి బడి ఈడు పిల్లలను, ప్రైవేటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులను గుర్తించి, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో అందే సౌకర్యాల గురించి తెలిపి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 89 కి పెంచడం జరిగింది. ప్రస్తుతం పాఠశాలలో 5 గురు టీచర్లు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజన పథకం ఈ పాఠశాలలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ మధ్యాహ్న భోజనం చాలా రుచికరంగా మెనూ ప్రకారం ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారానికి 3 సార్లు గుడ్లు, శనివారం నాడు"వెజ్ బిర్యాని" తప్పకుండా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ పాఠశాలలో పిల్లలు మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు ఉపాధ్యాయినిలు చాలా శ్రద్ధ వహిస్తారు. అన్నం కలుపుకోలేని చిన్న పిల్లలకు అన్నం కలిపి తినిపిస్తారు. భోజనంలో వండే పదార్థాలు అన్ని వృధా చేయకుండా పిల్లలు అందరూ తినేటట్లు టీచర్లు బాధ్యత వహిస్తారు. చేతులు శుభ్రం చేసుకోవడం, అన్నం తినే ముందు ప్రార్థన చేయడం, అనుపద్దతిలో కూర్చొని అన్నం తినడం, అంతా ఒక ప్రత్యేక పద్ధతిలో ఈ పాఠశాలలో జరుగుతుంది. పాఠశాలలోని పిల్లల పట్ల టీచర్లు చూపించే శ్రద్ధ, బాధ్యతలు ఇవన్నీ తల్లిదండ్రులకు నచ్చి ప్రైవేట్ పాఠశాలల నుండి తమ పిల్లలను తీసివేసి ఈ పాఠశాలలో చేర్పిస్తున్నారు. అందుకే ఈ పాఠశాలలో గత 3 సంవత్సరాల నుండి విద్యార్థుల సంఖ్య 85 నుండి 90 మధ్యలో కొనసాగుతోంది. ఉపాధ్యాయులు , స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ ప్రత్యేక చొరవలతో గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలకు పంపిస్తున్నారు. అదేవిధంగా పాఠశాల దినదినాభివృద్ధి లో ముందుకు కొనసాగుతోంది.


Body:బైట్స్

1) 2 విద్యార్థుల తల్లి

2) విద్యార్థి తల్లి

3) విద్యార్థి తల్లి

4) మహేందర్ రెడ్డి ( స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్)

5) సిహెచ్ రాధిక (ఉపాధ్యాయురాలు)

6) పైడపునాయుడు (ప్రధానోపాధ్యాయులు)


Conclusion:అంతకపేట లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవతో తల్లిదండ్రుల ప్రశంసలు అందుకుంటున్న మధ్యాహ్న భోజన పథకం అమలు.
Last Updated : Feb 5, 2019, 6:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.