తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి విజయం ప్రతిపక్షాలకు చెంపపెట్టులాంటిదని తెలిపారు. ఈ తీర్పును చూసైనా ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకొని తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిన్న పెండ్యాల గ్రామంలో ఆయన గురువారం పర్యటించారు. గ్రామంలోని మల్లంగుంట చెరువును సందర్శించి దేవాదుల నీటితో చెరువును నింపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: బంపర్ ఆఫర్: పాత బంగారానికి... కొత్త ఆభరణాలు