జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నంకు చెందిన శ్రీనివాస్కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య మమతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త రెండో పెళ్లి చేసుకోవడం వల్ల తరచూ గొడవ పడేవారు. గత కొన్నాళ్లుగా గొడవను చూసిన బాలుడు మనస్థాపం చెందాడు. తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యానని మనోవేదనతో పదేళ్ల బాలుడు శ్రవణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. జగిత్యాల ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రాణపాయమేమి లేదని వైద్యులు స్పష్టం చేశారు. అమ్మనాన్నలు అన్యోన్యంగా, ఆనందంగా ఉంటే పిల్లలు ఆనందంగా ఉంటారు. అమ్మనాన్నలు ఒక్కసారి ఆలోచించండి...మీ పిల్లల సంతోషాన్ని గుర్తుంచుకోండి.
ఇవీచూడండి: కర్ణాటకీయం లైవ్: విధాన సభ వద్ద ఘర్షణ!