ETV Bharat / state

జగిత్యాలలో పసుపు దగ్ధం... రూ.3 లక్షలు పంట నష్టం - FIRE UP FOR TURMERIC CROP IN JAGITYAL DISTRICT

పసుపు పంటను ఇంటికి తెచ్చి పెరట్లో నిల్వ చేయగా గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ప్రభుత్వమే తనకు న్యాయం చేయాలని రైతు కోరుతున్నాడు.

నాకు నా కుటుంబానికి ప్రభుత్వ సాయమే దిక్కు : బాధితుడు
నాకు నా కుటుంబానికి ప్రభుత్వ సాయమే దిక్కు : బాధితుడు
author img

By

Published : Apr 17, 2020, 9:56 AM IST

జగిత్యాల జిల్లా ధరూర్​లో పెరట్లో నిలువ ఉంచిన పసుపు దగ్ధమైంది. ధరూర్​కు చెందిన శీలం తిరుపతి అనే రైతు పసుపును ఉడకబెట్టేందుకు పెరట్లో నిల్వ చేశాడు. గుర్తు తెలియని దుండగులు రాత్రి తగులబెట్టారు. కాలిపోయిన పసుపు విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. చేతికొచ్చిన పసుపు కాలిబూడిద అయిందని రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు.

కరోనా కారణంగా లాక్ డౌన్​తో ఇబ్బందుల్లో ఉన్న తనకు పంట దగ్ధం మరింత కుంగదీసిందని రైతు బోరుమన్నాడు. ఎలాగైనా ప్రభుత్వమే ఆదుకోవాలని.. ఇందుకు వ్యవసాయ అధికారులు చొరవ తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

జగిత్యాల జిల్లా ధరూర్​లో పెరట్లో నిలువ ఉంచిన పసుపు దగ్ధమైంది. ధరూర్​కు చెందిన శీలం తిరుపతి అనే రైతు పసుపును ఉడకబెట్టేందుకు పెరట్లో నిల్వ చేశాడు. గుర్తు తెలియని దుండగులు రాత్రి తగులబెట్టారు. కాలిపోయిన పసుపు విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. చేతికొచ్చిన పసుపు కాలిబూడిద అయిందని రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు.

కరోనా కారణంగా లాక్ డౌన్​తో ఇబ్బందుల్లో ఉన్న తనకు పంట దగ్ధం మరింత కుంగదీసిందని రైతు బోరుమన్నాడు. ఎలాగైనా ప్రభుత్వమే ఆదుకోవాలని.. ఇందుకు వ్యవసాయ అధికారులు చొరవ తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

ఇవీ చూడండి : ప్రపంచంపై కరోనా పంజా.. ఒక్కరోజే 7వేల మంది మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.