ఏమేం చేశారు.?
పేద కుటుంబాలకు చెందిన గర్భిణీ స్త్రీలకు సీమంతం చేశారు. వారి కళ్ళల్లో ఆనందం చూసి వీరు మురిసిపోయారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన వైభవంగా చేశారు. హాజరైన వారందరికీ మిఠాయిలు తినిపించి గర్భిణీలకు శుభాకాంక్షలు చెప్పారు. ఇలాంటి వేడుకలు చేసుకోవాలన్న కోరికఉన్నా... పేదరికం వల్ల చేసుకోలేకపోతున్నామని కొందరు గర్భిణులు తెలిపారు.
గర్భిణులకు అవగాహన
పోషణ్ అభియాన్ వారోత్సవాల్లో భాగంగా గర్భిణీలతో పాటు బాలింతగా ఉన్నప్పుడు నిత్యం తీసుకోవాల్సిన పోషక పదార్థాలపై అవగాహన కల్పించారు.
రోజూ చిన్నారులతో సందడిగా ఉండే అంగన్ వాడీ కేంద్రం.. గర్భిణుల రాకతో కళకళలాడింది.