ETV Bharat / state

ఆసుపత్రి ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన - sanitation workers protest in jagtial district

సమాన పనికి-సమాన వేతనం చెల్లించాలంటూ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు 11వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఆసుపత్రి ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
ఆసుపత్రి ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
author img

By

Published : Jun 19, 2021, 3:22 PM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట పారిశుద్ధ్య కార్మికులు నిరసనకు దిగారు. సమాన పనికి-సమాన వేతనం చెల్లించాలంటూ ఆందోళన చేపట్టారు. ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేస్తున్న ప్రభుత్వం.. కార్మికులను మాత్రం మరిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 11వ పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

కరోనా సమయంలోనూ అలుపెరుగక విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సేవలను గుర్తించి వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట పారిశుద్ధ్య కార్మికులు నిరసనకు దిగారు. సమాన పనికి-సమాన వేతనం చెల్లించాలంటూ ఆందోళన చేపట్టారు. ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేస్తున్న ప్రభుత్వం.. కార్మికులను మాత్రం మరిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 11వ పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

కరోనా సమయంలోనూ అలుపెరుగక విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సేవలను గుర్తించి వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి: Nama Nageswara Rao: మధుకాన్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.