జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కరోనా వైరస్ బాధితులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఇటీవలే కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందగా... అటు ప్రజలు ఇటు అధికారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పట్టణంలో రెండు కేసులు నమోదు కాగా... తాజాగా చైతన్య నగర్లో నమోదైన మరో కేసులో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
ముందు జాగ్రత్త చర్యగా మెట్పల్లి పురపాలక కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పట్టణంలోని చైతన్య నగర్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. చుట్టుపక్కల ప్రజలకు అవగాహన కల్పించారు. మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులకు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ప్రజలు ఎవరికి భయపడవద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని.. ఒకవేళ వచ్చినా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని జగదీశ్వర్ గౌడ్ సూచించారు.
ఇవీ చూడండి: కరోనా కేసులపై హైకోర్టు విచారణ ఆగస్టు 13కి వాయిదా