ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో... ఎస్సీ నిరుద్యోగ యువత కోసం జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాలో మంత్రి పాల్గొన్నారు. సంస్థ అందిస్తున్న నైపుణ్య శిక్షణలో భాగంగా ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని శిక్షణ తీసుకోవాలని మంత్రి ఈశ్వర్ సూచించారు. దాదాపు 4 వందల మందిని శిక్షణకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ డాక్టర్ శరత్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు హాజరయ్యారు.
ఇవీ చూడండి: మూడోరోజు చర్చలు... ప్రయాణికుల్లో ఉత్కంఠ