రాష్ట్రంలో నిర్మిస్తున్న జలాశయాల వల్ల తెలంగాణ ఫిష్హబ్ గా మారుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మత్స్యకారులకు సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 75 శాతం రాయితీపై లగేజీ ఆటోలను అందించారు. రానున్న రోజుల్లో కోస్తాంధ్రను తలదన్నే విధంగా తెలంగాణ రాష్ట్రం చేపల పెంపకానికి కేంద్రంగా నిలుస్తుందన్నారు.
ఇవీ చూడండి: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు ముందస్తు బెయిల్