జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వలస కార్మికుడికి కరోనా లక్షణాలు వెలుగు చూడటం పట్ల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో అనారోగ్యనికి గురైన వారి వివరాలు సేకరించాలని ఏఎన్ఎంలను జిల్లా డీఎంహెచ్ఓ ఆదేశించారు.
ఈ మేరకు ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ఆరోగ్య సర్వే చేపట్టారు. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలను చైతన్యవంతం చేశారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, మాస్కు విధిగా ధరించాలని, తప్పనిసరి పరిస్థిల్లోనే ప్రయాణం చేయాలని ప్రతి గ్రామంలో ప్రచారం చేశారు. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే వలస కూలీలు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: వలస కూలీలను పంపేందుకు చర్యలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్