ETV Bharat / state

ఫేస్​బుక్​లో మరో పోస్ట్​.. స్పందించిన సీఎంఓ

author img

By

Published : Mar 30, 2019, 5:41 AM IST

Updated : Mar 30, 2019, 7:17 AM IST

ఇటీవల మంచిర్యాల జిల్లా రైతు ఫేస్​బుక్​లో భూ సమస్యను తెలియజేసి సీఎంనే కదిలేలా చేసిన ఘటనతో చాలా చోట్ల అన్నదాతలు అదే దారి అనుసరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇదే పంథాను అనుసరించిన జగిత్యాల జిల్లా రైతు సమస్యపై సీఎంఓ స్పందించింది.

మరో రైతు సమస్య పరిష్కారం
మరో రైతు సమస్య పరిష్కారం
గత 40 ఏళ్లుగా ఎన్ని కార్యాలయాల చుట్టూ తిరిగినా తన భూ సమస్య పరిష్కారం కాలేదని జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన మద్దినపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఇటీవల మంచిర్యాల జిల్లాకు చెందిన శరత్​ అనే రైతు సమస్యను స్వయంగా సీఎం పరిష్కరించడం వల్ల తన సమస్యా పరిష్కారం అవుతుందని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశాడు.

పోస్ట్​ చూసి సీఎంఓ స్పందన

శ్రీనివాస్​ పోస్ట్​ చూసి సమస్యపై దృష్టి సారించాలనిముఖ్యమంత్రి కార్యాలయం నుంచిజగిత్యాల జిల్లా కలెక్టర్​ శరత్​కు ఆదేశాలు జారీ అయ్యాయి. బాధితుడి ఇంటి వద్దకు వెళ్లి భూ వివాదం కోర్టులో ఉందని తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డులు పరిశీలించి త్వరలోనే పరిష్కారం చూపుతామని జిల్లా పాలనాధికారి హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:ఎల్బీ స్టేడియం సభకు హాజరు కాని సీఎం

మరో రైతు సమస్య పరిష్కారం
గత 40 ఏళ్లుగా ఎన్ని కార్యాలయాల చుట్టూ తిరిగినా తన భూ సమస్య పరిష్కారం కాలేదని జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన మద్దినపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఇటీవల మంచిర్యాల జిల్లాకు చెందిన శరత్​ అనే రైతు సమస్యను స్వయంగా సీఎం పరిష్కరించడం వల్ల తన సమస్యా పరిష్కారం అవుతుందని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశాడు.

పోస్ట్​ చూసి సీఎంఓ స్పందన

శ్రీనివాస్​ పోస్ట్​ చూసి సమస్యపై దృష్టి సారించాలనిముఖ్యమంత్రి కార్యాలయం నుంచిజగిత్యాల జిల్లా కలెక్టర్​ శరత్​కు ఆదేశాలు జారీ అయ్యాయి. బాధితుడి ఇంటి వద్దకు వెళ్లి భూ వివాదం కోర్టులో ఉందని తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డులు పరిశీలించి త్వరలోనే పరిష్కారం చూపుతామని జిల్లా పాలనాధికారి హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:ఎల్బీ స్టేడియం సభకు హాజరు కాని సీఎం

Last Updated : Mar 30, 2019, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.