విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలంటూ... జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుటు ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.
ఫీజు బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడుతోందని... విద్యార్థి సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: పసివాడి శరీరంలో 12 సూదులు.. ఎలా తట్టుకున్నాడో పాపం.!