ETV Bharat / state

టిక్​టాక్ కోసం విద్యుత్ స్తంభం ఎక్కాడు.. ఆ తర్వాత?

author img

By

Published : Jun 29, 2020, 3:31 PM IST

టిక్​టాక్ మీద మోజులో పడి ప్రాణాలనే పణంగా పెడుతున్నారు కొందరు. ఆటవిడుపు కోసం వాడాల్సిన యాప్​ను అదే ఒక యజ్ఞంగా చేస్తున్నారు. దాని ధ్యాసలోనే సమయాన్ని గడిపేస్తున్నారు. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లా డి.హీరేహాళ్​లో జరిగిన ఘటన, ప్రస్తుతం ఈ టిక్​టాక్​ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకోవటానికి ఉదాహరణ.

టిక్​టాక్ కోసం విద్యుత్ స్తంభం ఎక్కాడు... ఆ తర్వాత ?
టిక్​టాక్ కోసం విద్యుత్ స్తంభం ఎక్కాడు... ఆ తర్వాత ?

సరదా కోసం ప్రారంభించిన టిక్​టాక్ వీడియో షూటింగ్ ఆ యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. టిక్​టాక్ వీడియో చేయటానికి ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కాడా 17 ఏళ్ల యువకుడు. పట్టుతప్పి కిందపడిపోవటం వల్ల గాయాలైన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా డి.హీరేహాళ్​లో జరిగింది. ఇప్పటికైనా యువత ఇటువంటి ప్రమాదకర ప్రయత్నాలు మానుకోవాలని గ్రామ పెద్దలు సూచిస్తున్నారు.

సరదా కోసం ప్రారంభించిన టిక్​టాక్ వీడియో షూటింగ్ ఆ యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. టిక్​టాక్ వీడియో చేయటానికి ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కాడా 17 ఏళ్ల యువకుడు. పట్టుతప్పి కిందపడిపోవటం వల్ల గాయాలైన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా డి.హీరేహాళ్​లో జరిగింది. ఇప్పటికైనా యువత ఇటువంటి ప్రమాదకర ప్రయత్నాలు మానుకోవాలని గ్రామ పెద్దలు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్​ అలీకి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.