జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూపిస్తామని ఇప్పటి వరకు కేవలం 3,428 ఇళ్లనే చూపించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇవాళ చూపించిన తుక్కుగూడ, రాంపల్లి ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి రావన్నారు. ఇళ్ల సందర్శనను అర్ధాంతరంగా నిలిపివేశారు.
గ్రేటర్ పరిధిలో వందల ఎకరాల భూమి ఉందిని... అక్కడ కట్టవచ్చని భట్టి పేర్కొన్నారు. స్థలాలు చూపించేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో చూపించిన ఇళ్లనే ఇప్పుడు చూపిస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి : ఇళ్ల సందర్శనను అర్ధాంతరంగా నిలిపివేసిన కాంగ్రెస్