ETV Bharat / state

రాష్ట్రపతిని కలిసిన ఉత్తమ్​ దంపతులు - Uttam Meet President today news

హైదరాబాద్‌-విజయవాడల మధ్య బుల్లెట్‌ రైలు ప్రవేశ పెట్టే అంశమై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్‌ను కలిసి  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి రెడ్డిలు విజ్ఞప్తి చేశారు.

Uttam Meet President
Uttam Meet President
author img

By

Published : Dec 27, 2019, 11:39 PM IST

హైదరాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్‌ను టీపీసీసీ చీఫ్​ దంపతులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. విజయవాడ-హైదరాబాద్‌ రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య బుల్లెట్‌ రైలు ప్రవేశ పెట్టడం ద్వారా ప్రజారవాణా సౌకర్యం మరింత మెరుగవుతుందని పేర్కొనగా అందుకు సానుకూలంగా రాష్ట్రపతి స్పందించినట్లు ఉత్తమ్​ తెలిపారు. ఇదే విషయాన్ని రాష్ట్రపతి ద్వారా... కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉన్న అవకాశాలపై కూడా వారి మధ్య చర్చకు వచ్చింది. పూర్తి వివరాలతో తనను దిల్లీలో కలువాలని రాష్ట్రపతి సూచించారు. పూర్తి వివరాలతో త్వరలో రాష్ట్రపతిని కలుస్తానని ఉత్తమ్​ తెలిపారు.

హైదరాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్‌ను టీపీసీసీ చీఫ్​ దంపతులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. విజయవాడ-హైదరాబాద్‌ రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య బుల్లెట్‌ రైలు ప్రవేశ పెట్టడం ద్వారా ప్రజారవాణా సౌకర్యం మరింత మెరుగవుతుందని పేర్కొనగా అందుకు సానుకూలంగా రాష్ట్రపతి స్పందించినట్లు ఉత్తమ్​ తెలిపారు. ఇదే విషయాన్ని రాష్ట్రపతి ద్వారా... కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉన్న అవకాశాలపై కూడా వారి మధ్య చర్చకు వచ్చింది. పూర్తి వివరాలతో తనను దిల్లీలో కలువాలని రాష్ట్రపతి సూచించారు. పూర్తి వివరాలతో త్వరలో రాష్ట్రపతిని కలుస్తానని ఉత్తమ్​ తెలిపారు.


ఇవీ చూడండి:షెడ్యూలు​ విడుదలైనా.. రిజర్వేషన్లపై లేని స్పష్టత

TG_HYD_90_27_UTTAM_MEET_PRESIDENT_AV_3038066 Reporter: ఎం.తిరుపాల్‌ రెడ్డి Dry ()హైదరాబాద్‌-విజయవాడల మధ్య బుల్లెట్‌ రైలు ప్రవేశ పెట్టే అంశమై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్‌ను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి రెడ్డిలు విజ్ఞప్తి చేశారు. ఇవాళ హైదరాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో కోవింద్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నఉత్తమ్‌ దంపతులు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా విజయవాడ-హైదరాబాద్‌ రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య బుల్లెట్‌ రైలు ప్రవేశ పెట్టడం ద్వారా ప్రజారవాణా సౌకర్యం మరింత మెరుగైవుతుందని పేర్కొనగా అందుకు సానుకూలంగా రాష్ట్రపతి స్పందించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని రాష్ట్రపతి ద్వారా... కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉన్న అవకాశాలపై కూడా వారి మధ్య చర్చకు రావడంతో పూర్తి వివరాలతో తనను ధిల్లీలో కలువాలని...ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి రాష్ట్రపతి సూచించారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని అడగ్గా నిజమేనని చెప్పారు. పూర్తి వివరాలతో త్వరలో రాష్ట్రపతిని కలుస్తానని బుల్లెట్ రైలు అంశమై రాష్ట్రపతి ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానని తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.