ETV Bharat / state

ముఖ్యమంత్రి కేసీఆర్​తో అఖిలేశ్ యాదవ్​ భేటీ.. ఆ అంశాలపై చర్చలు

author img

By

Published : Jul 29, 2022, 7:37 PM IST

Updated : Jul 30, 2022, 3:21 AM IST

akhiesh yadav met kcr: ముఖ్యమంత్రి కేసీఆర్​తో యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్​ భేటీ అయ్యారు. దిల్లీలో దాదాపు 2 గంటలకు పైగా వీరి మధ్య చర్చలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలు.. వాటిని ఎలా ఎదుర్కొవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే వాటిపై చర్చలు జరిగినట్లు సమాచారం.

Cm Kcr met uthharapradesh ex cm akhilesh yadav in delhi
Cm Kcr met uthharapradesh ex cm akhilesh yadav in delhi

akhiesh yadav met kcr: ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రానికే పరిమితమవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న వారు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌లు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. నాయకత్వ పటిమ, పొరుగు రాష్ట్రాల్లో శూన్యతను భర్తీ చేసే శక్తి ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు రంగప్రవేశం చేయాలని అనుకున్నట్లు సమాచారం. అఖిలేష్‌ యాదవ్‌, ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్‌ యాదవ్‌లు శుక్రవారం మధ్యాహ్నం దిల్లీలో సీఎం కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఈ భేటీలో నేతలు చర్చించారు.

Cm Kcr met uthharapradesh ex cm akhilesh yadav in delhi
ముఖ్యమంత్రి కేసీఆర్​తో అఖిలేశ్ యాదవ్​ భేటీ.. ఆ అంశాలపై చర్చలు

కేంద్రం దుష్ట సంప్రదాయం..: కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను విపక్ష ప్రభుత్వాల్లోని మంత్రులు, ప్రజాప్రతినిధులపై ఉసిగొల్పుతూ దుష్ట సంప్రదాయానికి తెర తీసిందనే అంశంలో నేతలిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దక్షిణాది పార్టీల విస్తరణకు భాషాపరమైన అడ్డంకులు ఉన్నాయని... ఉత్తర భారతంలో ఆ సమస్య లేనందున ఎస్పీ వంటి పార్టీలు పొరుగు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్‌, బిహార్‌, దిల్లీ, హరియాణాల్లోనూ విస్తరించాలని కేసీఆర్‌ సూచించినట్లు తెలిసింది. పరస్పర విస్తరణకు ప్రాంతీయ పార్టీలు సహకరించుకోవాలని.. ఫలితంగా జాతీయ రాజకీయాల్లోనూ ప్రభావం చూపొచ్చని చర్చించుకున్నట్లు సమాచారం. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో అఖిలేష్‌ యాదవ్‌, ఎస్పీ సీనియర్‌ నేత ఆజంఖాన్‌లు వదులుకున్న లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంపైనా చర్చ సాగినట్లు తెలిసింది.

KCR
సమాజ్‌ వాది పార్టీ ఎంపీ రాంగోపాల్‌ యాదవ్​కు శాలువ కప్పిన కేసీఆర్

బీఎస్పీ రాంపూర్‌లో అభ్యర్థిని నిలపకుండా ఏకపక్షంగా భాజపాకు మద్దతు పలకడం, ఆజంగఢ్‌లో ముస్లిం అభ్యర్థిని బరిలో నిలిపి ఎస్పీ ఓట్లకు గండికొట్టి కాషాయ పార్టీ గెలుపునకు దోహదపడిందని అఖిలేష్‌ వివరించినట్లు సమాచారం. గంటన్నరపాటు సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌, అఖిలేష్‌ యాదవ్‌, రాంగోపాల్‌ యాదవ్‌, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అఖిలేష్‌ మే 21న దిల్లీలో కేసీఆర్‌ను కలిశారు. తాజాగా మరోసారి భేటీ అవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పరస్పర సహకారంతో యూపీలో తెరాస, తెలంగాణలో సమాజ్‌వాదీ పార్టీలు ఒకట్రెండు చోట్ల పోటీ చేస్తాయనే భావన వ్యక్తమవుతోంది.ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్‌, రైతునేత రాకేష్‌ టికాయిత్‌ సైతం సీఎంని కలుస్తారని ప్రచారం జరిగినా.. వారు రాలేదు.

ఇదీ చూడండి: 'రుణాలపై పొరుగు రాష్ట్రాలేం చేస్తున్నాయ్‌'.. అధికారులతో సీఎం కేసీఆర్

akhiesh yadav met kcr: ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రానికే పరిమితమవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న వారు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌లు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. నాయకత్వ పటిమ, పొరుగు రాష్ట్రాల్లో శూన్యతను భర్తీ చేసే శక్తి ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు రంగప్రవేశం చేయాలని అనుకున్నట్లు సమాచారం. అఖిలేష్‌ యాదవ్‌, ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్‌ యాదవ్‌లు శుక్రవారం మధ్యాహ్నం దిల్లీలో సీఎం కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఈ భేటీలో నేతలు చర్చించారు.

Cm Kcr met uthharapradesh ex cm akhilesh yadav in delhi
ముఖ్యమంత్రి కేసీఆర్​తో అఖిలేశ్ యాదవ్​ భేటీ.. ఆ అంశాలపై చర్చలు

కేంద్రం దుష్ట సంప్రదాయం..: కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను విపక్ష ప్రభుత్వాల్లోని మంత్రులు, ప్రజాప్రతినిధులపై ఉసిగొల్పుతూ దుష్ట సంప్రదాయానికి తెర తీసిందనే అంశంలో నేతలిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దక్షిణాది పార్టీల విస్తరణకు భాషాపరమైన అడ్డంకులు ఉన్నాయని... ఉత్తర భారతంలో ఆ సమస్య లేనందున ఎస్పీ వంటి పార్టీలు పొరుగు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్‌, బిహార్‌, దిల్లీ, హరియాణాల్లోనూ విస్తరించాలని కేసీఆర్‌ సూచించినట్లు తెలిసింది. పరస్పర విస్తరణకు ప్రాంతీయ పార్టీలు సహకరించుకోవాలని.. ఫలితంగా జాతీయ రాజకీయాల్లోనూ ప్రభావం చూపొచ్చని చర్చించుకున్నట్లు సమాచారం. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో అఖిలేష్‌ యాదవ్‌, ఎస్పీ సీనియర్‌ నేత ఆజంఖాన్‌లు వదులుకున్న లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంపైనా చర్చ సాగినట్లు తెలిసింది.

KCR
సమాజ్‌ వాది పార్టీ ఎంపీ రాంగోపాల్‌ యాదవ్​కు శాలువ కప్పిన కేసీఆర్

బీఎస్పీ రాంపూర్‌లో అభ్యర్థిని నిలపకుండా ఏకపక్షంగా భాజపాకు మద్దతు పలకడం, ఆజంగఢ్‌లో ముస్లిం అభ్యర్థిని బరిలో నిలిపి ఎస్పీ ఓట్లకు గండికొట్టి కాషాయ పార్టీ గెలుపునకు దోహదపడిందని అఖిలేష్‌ వివరించినట్లు సమాచారం. గంటన్నరపాటు సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌, అఖిలేష్‌ యాదవ్‌, రాంగోపాల్‌ యాదవ్‌, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అఖిలేష్‌ మే 21న దిల్లీలో కేసీఆర్‌ను కలిశారు. తాజాగా మరోసారి భేటీ అవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పరస్పర సహకారంతో యూపీలో తెరాస, తెలంగాణలో సమాజ్‌వాదీ పార్టీలు ఒకట్రెండు చోట్ల పోటీ చేస్తాయనే భావన వ్యక్తమవుతోంది.ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్‌, రైతునేత రాకేష్‌ టికాయిత్‌ సైతం సీఎంని కలుస్తారని ప్రచారం జరిగినా.. వారు రాలేదు.

ఇదీ చూడండి: 'రుణాలపై పొరుగు రాష్ట్రాలేం చేస్తున్నాయ్‌'.. అధికారులతో సీఎం కేసీఆర్

Last Updated : Jul 30, 2022, 3:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.