ETV Bharat / state

Rozgar Mela Selected Candidates : "రోజ్​గార్​​ మేళాలో 71000 మంది ఎంపిక అయ్యారు"

Rozgar Mela is organiz in Secunderabad : సికింద్రాబాద్​లో నిర్వహించిన రోజ్​గార్​ మేళాలో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేళాలో అర్ఙత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ నెల దేశవ్యాప్తంగా 71వేల మంది ఈ కార్యక్రమంలో ఎంపిక అయ్యారని తెలిపారు.

author img

By

Published : May 16, 2023, 4:21 PM IST

Etv Bharat
Etv Bharat
సికింద్రాబాద్​లో రోజ్​గార్​ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు

Rozgar Mela is organiz in Secunderabad : రాష్ట్రంలోను, ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఉద్యోగ నియామకాల్లో అవకవకలు జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రోజ్​గార్​ మేళాలో అవినీతికి తావు లేకుండా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి నెల 16, 17, 18 తేదీల్లోని ఒకరోజు రోజ్​గార్​ మేళాను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని మంత్రి తెలియజేశారు. సికింద్రాబాద్​ ఎస్​వీఐటీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యోగాలకు ఎంపికైనా అభ్యర్థులకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా అన్ని రకాల శాఖల్లో సుమారు 71,000 యువతకు నియామకాలు చేపట్టామని తెలిపారు. సికింద్రాబాద్​లో కొత్తగా ఎంపికైన వారిని ఆయన అభినందించారు.

నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది : కేంద్ర ప్రభుత్వం యువత కోసం పెద్ద ఎత్తున ఉద్యోగాలు నియామకం చేస్తోందని పేర్కొన్నారు. దాదాపు పది లక్షల మంది యువతకు దేశవ్యాప్తంగా ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని చేపట్టి వేగవంతంగా ముందుకు దూసుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. నోటిఫికేషన్​లో పొందుపరిచిన విధంగానే పరీక్షలను వేగంగా నిర్వహించి సకాలంలో యువతకు నియామక పత్రాలు ఇస్తున్నామని అన్నారు.

ఉద్యోగ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. ఈ మేళాను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్థులు అధిక సంఖ్యలో వచ్చారు. ఉద్యోగంలో ఎంపికైన వారు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టినందుకు ధన్యవాదములు తెలియజేశారు. యువత కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని.. నిరుద్యోగులకు సరైన అవకాశాలు కల్పించాలని కోరారు.

"ఉద్యోగాల భర్తీ కార్యక్రమం ఒక మిషన్​ మోడ్​లాగ భారత ప్రభుత్వం చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు నెలల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పది లక్షలు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. ప్రతి నెల 70 వేల నుంచి లక్ష మందిని నియమిస్తున్నాం. వేగంగా, పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపడుతున్నాం. అన్ని శాఖల్లోను ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం."- కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి

"నాది సంగారెడ్డి జిల్లా ఎన్​పీఎంలో ఉద్యోగం వచ్చింది. జీడీఎస్​ నోటిఫికేషన్​ పడినప్పుడు ఆన్​లైన్​లో అప్లై చేశాను. ఈ ఉద్యోగం నాకు 10వ తరగతి మార్కులు ఆధారంగా వచ్చింది. ప్రధాని మోదీకి ధన్యవాదములు."- సంధ్య, నియామక పత్రం తీసుకున్న అభ్యర్థి

ఇవీ చదవండి:

సికింద్రాబాద్​లో రోజ్​గార్​ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు

Rozgar Mela is organiz in Secunderabad : రాష్ట్రంలోను, ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఉద్యోగ నియామకాల్లో అవకవకలు జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రోజ్​గార్​ మేళాలో అవినీతికి తావు లేకుండా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి నెల 16, 17, 18 తేదీల్లోని ఒకరోజు రోజ్​గార్​ మేళాను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని మంత్రి తెలియజేశారు. సికింద్రాబాద్​ ఎస్​వీఐటీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యోగాలకు ఎంపికైనా అభ్యర్థులకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా అన్ని రకాల శాఖల్లో సుమారు 71,000 యువతకు నియామకాలు చేపట్టామని తెలిపారు. సికింద్రాబాద్​లో కొత్తగా ఎంపికైన వారిని ఆయన అభినందించారు.

నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది : కేంద్ర ప్రభుత్వం యువత కోసం పెద్ద ఎత్తున ఉద్యోగాలు నియామకం చేస్తోందని పేర్కొన్నారు. దాదాపు పది లక్షల మంది యువతకు దేశవ్యాప్తంగా ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని చేపట్టి వేగవంతంగా ముందుకు దూసుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. నోటిఫికేషన్​లో పొందుపరిచిన విధంగానే పరీక్షలను వేగంగా నిర్వహించి సకాలంలో యువతకు నియామక పత్రాలు ఇస్తున్నామని అన్నారు.

ఉద్యోగ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. ఈ మేళాను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్థులు అధిక సంఖ్యలో వచ్చారు. ఉద్యోగంలో ఎంపికైన వారు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టినందుకు ధన్యవాదములు తెలియజేశారు. యువత కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని.. నిరుద్యోగులకు సరైన అవకాశాలు కల్పించాలని కోరారు.

"ఉద్యోగాల భర్తీ కార్యక్రమం ఒక మిషన్​ మోడ్​లాగ భారత ప్రభుత్వం చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు నెలల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పది లక్షలు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. ప్రతి నెల 70 వేల నుంచి లక్ష మందిని నియమిస్తున్నాం. వేగంగా, పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపడుతున్నాం. అన్ని శాఖల్లోను ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం."- కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి

"నాది సంగారెడ్డి జిల్లా ఎన్​పీఎంలో ఉద్యోగం వచ్చింది. జీడీఎస్​ నోటిఫికేషన్​ పడినప్పుడు ఆన్​లైన్​లో అప్లై చేశాను. ఈ ఉద్యోగం నాకు 10వ తరగతి మార్కులు ఆధారంగా వచ్చింది. ప్రధాని మోదీకి ధన్యవాదములు."- సంధ్య, నియామక పత్రం తీసుకున్న అభ్యర్థి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.