ETV Bharat / state

ఆన్​లైన్​లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు - ఆన్​లైన్​లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు

సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్​లైన్​లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఉత్తర మండలం టాస్క్​ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిసింది. నిందితుల నుంచి మూడు లక్షల నగదు, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

two people have been arrested for online betting at hyderabad
ఆన్​లైన్​లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు
author img

By

Published : Jul 29, 2020, 10:24 PM IST

హైదరాబాద్ బోయిన్​పల్లి, నేరేడ్​మెట్ ప్రాంతాలకు చెందిన రాజేష్, నాగేష్, దీపక్ అనే ముగ్గురు కలిసి ఆన్​లైన్​లో జూదం నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారిలో దీపక్​ పరారీలో ఉన్నట్లు సమాచారం. జూదం ఒక్కటే కాకుండా అన్ని రకాల ఆటలకు సంబంధించి బెట్టింగ్ నిర్వహిస్తూ సొమ్ము చేసుకునే వారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి మూడు లక్షల నగదు, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

కొత్త వెబ్​సైట్లను సృష్టించి వాటి ద్వారా ప్రజలను ఆహ్వానించి బెట్టింగ్​కు పాల్పడుతున్నట్లు పోలీసులు వివరించారు. పందెం కాసిన వారు తీవ్రంగా నష్టపోవడం వల్ల వీరు లాభాలు పొందుతున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్ బోయిన్​పల్లి, నేరేడ్​మెట్ ప్రాంతాలకు చెందిన రాజేష్, నాగేష్, దీపక్ అనే ముగ్గురు కలిసి ఆన్​లైన్​లో జూదం నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారిలో దీపక్​ పరారీలో ఉన్నట్లు సమాచారం. జూదం ఒక్కటే కాకుండా అన్ని రకాల ఆటలకు సంబంధించి బెట్టింగ్ నిర్వహిస్తూ సొమ్ము చేసుకునే వారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి మూడు లక్షల నగదు, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

కొత్త వెబ్​సైట్లను సృష్టించి వాటి ద్వారా ప్రజలను ఆహ్వానించి బెట్టింగ్​కు పాల్పడుతున్నట్లు పోలీసులు వివరించారు. పందెం కాసిన వారు తీవ్రంగా నష్టపోవడం వల్ల వీరు లాభాలు పొందుతున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి : రాష్ట్ర వ్యాప్తంగా 35,308 కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.