ETV Bharat / state

సైబరాబాద్‌ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2023, 2:24 PM IST

Updated : Dec 28, 2023, 7:01 PM IST

Two Inspectors Suspended In Cyberabad : సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. కేపీహెచ్​బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్, ఆర్జీఐ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేస్తూ సీపీ అవినాశ్‌ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

inspectors suspended in hyderabad
Two inspectors suspended in Cyberabad

Two Inspectors Suspended In Cyberabad : సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. కేపీహెచ్​బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్, ఆర్జీఐ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేస్తూ సీపీ అవినాశ్‌ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. దంపతుల కేసు వ్యవహారంలో భర్తను కేపీహెచ్​బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌ పోలీస్​ స్టేషన్​కు పిలిపించి చితకబాదారనే ఆరోపణలతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇదే వ్యవహారంలో సీఐ వెంకట్‌ సహా సిబ్బందికి మెమోలు జారీ చేశారు. మరోవైపు ఇంకో కేసు విషయంలో నిర్లక్ష్యం వహించారని ఎయిర్‌పోర్టు పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

గృహ హింస కేసు బాధితుడు ప్రణీత్​ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన మొవ్వా ప్రణీత్​కు అదే జిల్లాకు చెందిన శ్రీలక్ష్మితో 2018లో వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య వివాదం రావటంతో శ్రీలక్ష్మి, ప్రణీత్​పై గుంటూరులోని దిశ పోలీస్ స్టేషన్​లో(Disha Police Station) కేసు పెట్టి, అతడికి దూరంగా ఉంటుంది.

ప్రణీత్ హైదరాబాద్​లో ఓ బ్యాంకులో మేనేజరుగా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం శ్రీలక్ష్మి తన భర్త వేధింపులపై ఫిర్యాదు చేస్తూ తన సర్టిఫికెట్లు తన భర్త వద్దే ఉన్నాయని, తనకి న్యాయం చేయాలంటూ గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్​లో(Nallapadu Police Station)ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో ఉండగా మళ్లీ కేసు నమోదు చేయమని అక్కడి పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో శ్రీలక్ష్మి, తన భర్త నిజాంపేట రోడ్డులో నివసిస్తూ ఉండటంతో కేపీహెచ్​బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

KPHB Police Case : విచారణ నిమిత్తం స్టేషన్​కు పిలిపించిన కేపీహెచ్​బీ పోలీసులకు, తనపై అప్పటికే కేసు నమోదై విచారణలో ఉన్నట్లు ప్రణీత్ తెలిపాడు. అయినా శ్రీలక్ష్మి సర్టిఫికెట్స్ ఇవ్వాలంటూ పోలీసులు అతడిని దూషిస్తూ, విచక్షణారహితంగా చితకబాదారని, దీంతో తనకు తీవ్రగాయాలయ్యాయని బాధితుడు తెలిపాడు. తనపై అకారణంగా దాడికి పాల్పడిన సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలంటూ ప్రణీత్ సామాజిక మాధ్యమం(Social Media) ద్వారా సైబరాబాద్ పోలీస్ కమిషనర్​కు ఫిర్యాదు చేశాడు.

బాధితుడు ప్రణీత్​ ఫిర్యాదు మేరకు సైబారాబాద్​ కమిషనర్​ అవినాశ్‌ మహంతి కేపీహెచ్‌బీ పోలీసులపై విచారణ చేయాలని ఆదేశించారు. విచారణ అనంతరం కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్​ను​ సస్పెండ్‌ చేస్తూ సీపీ అవినాశ్‌ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

CP suspend RTI Inspector : మరోవైపు ఎయిర్‌పోర్టు పీఎస్‌ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్​పై కూడా సీపీ అవినాష్ మహంతికి(CP Avinash Mohanty) ఓ మహిళ ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలిలోని మైహోం భూజాలో తల్లిదండ్రులతో నివాసం ఉంటున్న యశస్వి ఎయిర్‌పోర్టు పీఎస్‌ ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్​పై ఫిర్యాదు చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం శారద అనే మహిళతో కలిసి తన తల్లి స్థిరాస్తి వ్యాపారం చేస్తుందని యశస్వి చెప్పారు. శారద తన తల్లిపై ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుపై దర్యాప్తు చేయకుండానే ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్, అక్రమంగా తన తల్లిని, తండ్రిని, సోదరుడిని అరెస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్ తన తల్లి చేతికి బేడీలు వేసి అనంతరం ఫొటోలను తీసి శారదకు పంపారని ఆయన ఆరోపించారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టి శారద తమను కించపరిచిందని యశస్వి తెలిపారు. యశస్వి ఇచ్చిన ఫిర్యాదును డీజీపీ(DGP) సైబరాబాద్ సీపీకి ఫార్వాడ్ చేశారు. దీనిపై విచారణ జరిపి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదేం తీరు పోలీసన్నా - రక్షించాల్సిన మీరే రాంగ్ రూట్​లోకి వెళితే ఎలాగన్నా?

భూవివాదంలో ఎస్సై కొట్టడంతో వ్యక్తి మృతి! సస్పెండ్ చేసిన ఐజీ

Two Inspectors Suspended In Cyberabad : సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. కేపీహెచ్​బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్, ఆర్జీఐ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేస్తూ సీపీ అవినాశ్‌ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. దంపతుల కేసు వ్యవహారంలో భర్తను కేపీహెచ్​బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌ పోలీస్​ స్టేషన్​కు పిలిపించి చితకబాదారనే ఆరోపణలతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇదే వ్యవహారంలో సీఐ వెంకట్‌ సహా సిబ్బందికి మెమోలు జారీ చేశారు. మరోవైపు ఇంకో కేసు విషయంలో నిర్లక్ష్యం వహించారని ఎయిర్‌పోర్టు పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

గృహ హింస కేసు బాధితుడు ప్రణీత్​ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన మొవ్వా ప్రణీత్​కు అదే జిల్లాకు చెందిన శ్రీలక్ష్మితో 2018లో వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య వివాదం రావటంతో శ్రీలక్ష్మి, ప్రణీత్​పై గుంటూరులోని దిశ పోలీస్ స్టేషన్​లో(Disha Police Station) కేసు పెట్టి, అతడికి దూరంగా ఉంటుంది.

ప్రణీత్ హైదరాబాద్​లో ఓ బ్యాంకులో మేనేజరుగా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం శ్రీలక్ష్మి తన భర్త వేధింపులపై ఫిర్యాదు చేస్తూ తన సర్టిఫికెట్లు తన భర్త వద్దే ఉన్నాయని, తనకి న్యాయం చేయాలంటూ గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్​లో(Nallapadu Police Station)ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో ఉండగా మళ్లీ కేసు నమోదు చేయమని అక్కడి పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో శ్రీలక్ష్మి, తన భర్త నిజాంపేట రోడ్డులో నివసిస్తూ ఉండటంతో కేపీహెచ్​బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

KPHB Police Case : విచారణ నిమిత్తం స్టేషన్​కు పిలిపించిన కేపీహెచ్​బీ పోలీసులకు, తనపై అప్పటికే కేసు నమోదై విచారణలో ఉన్నట్లు ప్రణీత్ తెలిపాడు. అయినా శ్రీలక్ష్మి సర్టిఫికెట్స్ ఇవ్వాలంటూ పోలీసులు అతడిని దూషిస్తూ, విచక్షణారహితంగా చితకబాదారని, దీంతో తనకు తీవ్రగాయాలయ్యాయని బాధితుడు తెలిపాడు. తనపై అకారణంగా దాడికి పాల్పడిన సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలంటూ ప్రణీత్ సామాజిక మాధ్యమం(Social Media) ద్వారా సైబరాబాద్ పోలీస్ కమిషనర్​కు ఫిర్యాదు చేశాడు.

బాధితుడు ప్రణీత్​ ఫిర్యాదు మేరకు సైబారాబాద్​ కమిషనర్​ అవినాశ్‌ మహంతి కేపీహెచ్‌బీ పోలీసులపై విచారణ చేయాలని ఆదేశించారు. విచారణ అనంతరం కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్​ను​ సస్పెండ్‌ చేస్తూ సీపీ అవినాశ్‌ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

CP suspend RTI Inspector : మరోవైపు ఎయిర్‌పోర్టు పీఎస్‌ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్​పై కూడా సీపీ అవినాష్ మహంతికి(CP Avinash Mohanty) ఓ మహిళ ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలిలోని మైహోం భూజాలో తల్లిదండ్రులతో నివాసం ఉంటున్న యశస్వి ఎయిర్‌పోర్టు పీఎస్‌ ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్​పై ఫిర్యాదు చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం శారద అనే మహిళతో కలిసి తన తల్లి స్థిరాస్తి వ్యాపారం చేస్తుందని యశస్వి చెప్పారు. శారద తన తల్లిపై ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుపై దర్యాప్తు చేయకుండానే ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్, అక్రమంగా తన తల్లిని, తండ్రిని, సోదరుడిని అరెస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్ తన తల్లి చేతికి బేడీలు వేసి అనంతరం ఫొటోలను తీసి శారదకు పంపారని ఆయన ఆరోపించారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టి శారద తమను కించపరిచిందని యశస్వి తెలిపారు. యశస్వి ఇచ్చిన ఫిర్యాదును డీజీపీ(DGP) సైబరాబాద్ సీపీకి ఫార్వాడ్ చేశారు. దీనిపై విచారణ జరిపి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదేం తీరు పోలీసన్నా - రక్షించాల్సిన మీరే రాంగ్ రూట్​లోకి వెళితే ఎలాగన్నా?

భూవివాదంలో ఎస్సై కొట్టడంతో వ్యక్తి మృతి! సస్పెండ్ చేసిన ఐజీ

Last Updated : Dec 28, 2023, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.