ETV Bharat / state

ఆగిన చక్రాలు... ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు...

author img

By

Published : Oct 5, 2019, 5:03 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే... అందిన కాడికి దోచుకుంటున్నారు. డబుల్​ ఛార్జీలతో మోత మోగిస్తున్నారు.  కొన్ని చోట్ల తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లతో బస్సులు కదిలాయి. అయినప్పటికీ ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణ ప్రాంగణాలు వెలవెల... ప్రయాణికులు విలవిల
ఆగిన చక్రాలు... ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు...

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణ ప్రాంగణం బస్సులు లేక వెలవెల పోతున్నాయి. రేపే బతుకమ్మ పండుగ కావడం వల్ల ప్రజలు సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్​లోని పలు బస్​స్టేషన్​లో బస్సులు కదలలేదు.

జేబీఎస్

జూబ్లీ బస్​స్టేషన్​ వద్ద ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఊర్లోకి వెళ్లేందుకు రిజర్వేషన్స్​ చేసుకున్నప్పటికీ బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కూకట్​పల్లి

కూకట్​పల్లిలో 139 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మిక విభాగం నాయకులు, కార్యకర్తలు సమ్మెకు మద్దతిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే... దొరికిందే ఛాన్సు అన్నట్లు అందినకాడికి దోచుకుంటున్నారు.

కోఠి

కోఠి బస్​స్టేషన్​ వద్ద ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే... డబుల్​ ఛార్జీల మోత మోగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్రహీంపట్నం

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 163 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఇక్కడ కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మేడ్చల్

మేడ్చల్​లో బస్​లు లేక ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. 126 బస్​లు డిపోలకే పరిమితమయ్యాయి.

దిల్​సుఖ్​నగర్

దిల్​సుఖ్​నగర్​లో బస్​ డిపో వద్ద సమ్మెలో పాల్గొన్న కార్మికులను ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి పలకరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ తీసుకుంటానని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసి తమకు న్యాయం చేయాలని కార్మికులు ఎమ్మెల్యేకు విన్నపించారు.

హెచ్​సీయూ

గచ్చిబౌలి హెచ్​సీయూ వద్ద డిపోలో 136 బస్సులు నిలిచిపోయాయి. కార్మికులు విధులకు హాజరుకాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు పోలీసు సిబ్బంది 20 మంది ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడుపుతున్నారు.

ముషీరాబాద్​

ముషీరాబాద్​ డిపో1, డిపో2లకు చెందిన దాదాపు 200 బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. డిపోల నుంచి అనునిత్యం పటాన్‌ చెరువు, సికింద్రాబాద్‌, కోఠి, హైటెక్‌ సిటీ, కోండాపుర్‌, మాదాపుర్‌, మెహిదీపట్నం, బీర్బన్‌ బాగ్‌, ఉప్పల్‌ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఈ బస్సు సర్వీసులు డిపోలకు పరిమితమయ్యాయి. బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.

ఉప్పల్​ డిపో

ఉప్పల్​ డిపోలో 149, చెంగిచర్ల డిపోలో 130 బస్సులు నిలిచిపోయాయి. డిపోల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఫలకనుమ

ఫలకనుమ డిపో వద్ద ఆర్టీసీ అధికారులు ప్రైవేటు డ్రైవర్లను, కండక్టర్లను ఏర్పాటు చేశారు. వారితో బస్​లను రోడ్లపైకి నడిపిస్తున్నారు. ఇప్పటికే 5 బస్సులను డిపో నుంచి బయటకు పంపించారు.

పాతబస్తీ

సమ్మె కారణంగా పాతబస్తీ వద్ద 69 బస్సులు నిలిచిపోయాయి. దీనికి ప్రత్యామ్నాయంగా అధికారులు ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను పెట్టి బస్సులను నడిపిస్తామని చెబుతున్నారు.

అంబర్​ పేట

అంబర్​పేటలో ఆర్టీసీ కార్మికుల బంద్​ కారణంగా పోలీసులు144 సెక్షన్​ విధించారు. కాచిగూడ డిపో పరిధిలో మొత్తం 116 బస్సులకుగానూ ఇప్పటివరకు 9 బస్సులను, ఒక ప్రైవేటు బస్సును నడుపుతున్నారు. అలాగే బర్కత్​పురా డిపో పరిధిలో మొత్తం 89 బస్సులకు గానూ కేవలం 6 బస్సులను తిప్పుతున్నారు.

కుషాయిగూడ

ఆర్టీసీ సమ్మె కారణంగా కుషాయిగూడ డిపోలో అధికారులు ఇప్పటివరకు 21 బస్సులు తాత్కాలిక డ్రైవర్లతో నడుపుతున్నారు. రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు.

ఇదీ చూడండి: సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోంది: ఆర్టీసీ ఐకాస

ఆగిన చక్రాలు... ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు...

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణ ప్రాంగణం బస్సులు లేక వెలవెల పోతున్నాయి. రేపే బతుకమ్మ పండుగ కావడం వల్ల ప్రజలు సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్​లోని పలు బస్​స్టేషన్​లో బస్సులు కదలలేదు.

జేబీఎస్

జూబ్లీ బస్​స్టేషన్​ వద్ద ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఊర్లోకి వెళ్లేందుకు రిజర్వేషన్స్​ చేసుకున్నప్పటికీ బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కూకట్​పల్లి

కూకట్​పల్లిలో 139 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మిక విభాగం నాయకులు, కార్యకర్తలు సమ్మెకు మద్దతిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే... దొరికిందే ఛాన్సు అన్నట్లు అందినకాడికి దోచుకుంటున్నారు.

కోఠి

కోఠి బస్​స్టేషన్​ వద్ద ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే... డబుల్​ ఛార్జీల మోత మోగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్రహీంపట్నం

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 163 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఇక్కడ కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మేడ్చల్

మేడ్చల్​లో బస్​లు లేక ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. 126 బస్​లు డిపోలకే పరిమితమయ్యాయి.

దిల్​సుఖ్​నగర్

దిల్​సుఖ్​నగర్​లో బస్​ డిపో వద్ద సమ్మెలో పాల్గొన్న కార్మికులను ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి పలకరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ తీసుకుంటానని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసి తమకు న్యాయం చేయాలని కార్మికులు ఎమ్మెల్యేకు విన్నపించారు.

హెచ్​సీయూ

గచ్చిబౌలి హెచ్​సీయూ వద్ద డిపోలో 136 బస్సులు నిలిచిపోయాయి. కార్మికులు విధులకు హాజరుకాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు పోలీసు సిబ్బంది 20 మంది ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడుపుతున్నారు.

ముషీరాబాద్​

ముషీరాబాద్​ డిపో1, డిపో2లకు చెందిన దాదాపు 200 బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. డిపోల నుంచి అనునిత్యం పటాన్‌ చెరువు, సికింద్రాబాద్‌, కోఠి, హైటెక్‌ సిటీ, కోండాపుర్‌, మాదాపుర్‌, మెహిదీపట్నం, బీర్బన్‌ బాగ్‌, ఉప్పల్‌ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఈ బస్సు సర్వీసులు డిపోలకు పరిమితమయ్యాయి. బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.

ఉప్పల్​ డిపో

ఉప్పల్​ డిపోలో 149, చెంగిచర్ల డిపోలో 130 బస్సులు నిలిచిపోయాయి. డిపోల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఫలకనుమ

ఫలకనుమ డిపో వద్ద ఆర్టీసీ అధికారులు ప్రైవేటు డ్రైవర్లను, కండక్టర్లను ఏర్పాటు చేశారు. వారితో బస్​లను రోడ్లపైకి నడిపిస్తున్నారు. ఇప్పటికే 5 బస్సులను డిపో నుంచి బయటకు పంపించారు.

పాతబస్తీ

సమ్మె కారణంగా పాతబస్తీ వద్ద 69 బస్సులు నిలిచిపోయాయి. దీనికి ప్రత్యామ్నాయంగా అధికారులు ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను పెట్టి బస్సులను నడిపిస్తామని చెబుతున్నారు.

అంబర్​ పేట

అంబర్​పేటలో ఆర్టీసీ కార్మికుల బంద్​ కారణంగా పోలీసులు144 సెక్షన్​ విధించారు. కాచిగూడ డిపో పరిధిలో మొత్తం 116 బస్సులకుగానూ ఇప్పటివరకు 9 బస్సులను, ఒక ప్రైవేటు బస్సును నడుపుతున్నారు. అలాగే బర్కత్​పురా డిపో పరిధిలో మొత్తం 89 బస్సులకు గానూ కేవలం 6 బస్సులను తిప్పుతున్నారు.

కుషాయిగూడ

ఆర్టీసీ సమ్మె కారణంగా కుషాయిగూడ డిపోలో అధికారులు ఇప్పటివరకు 21 బస్సులు తాత్కాలిక డ్రైవర్లతో నడుపుతున్నారు. రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు.

ఇదీ చూడండి: సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోంది: ఆర్టీసీ ఐకాస

Intro:hyd_tg_tdr_5_rfcsamme_av_ts10025_bheemaiah

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వికారాబాద్ జిల్లా తాండూరులో పాక్షికంగా కొనసాగుతుంది పోలీస్ బందోబస్తు మధ్య ఆర్టీసీ అధికారులు బస్సులను పాక్షికంగా నడిపిస్తున్నారు


Body:ఉదయం నుంచి ఎనిమిది బస్సులను అధికారులు పోలీసుల రక్షణలో మహబూబ్నగర హైదరాబాద్ చించోలి ప్రాంతాలకు తులు నడిపించారు మిగతా బస్సులు డిపో లేని ఉండిపోయాయి బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు


Conclusion:డిఎస్పి రామచంద్రుడు ఆధ్వర్యంలో లో పోలీసులు ఆర్టీసీ డిపో తో పాటు బస్ స్టేషన్లు బందోబస్తు నిర్వహిస్తున్నారు కార్మికులను పరిసరాల్లో ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఇదిలా ఉండగా ప్రైవేట్ వ్యక్తులతో డ్రైవర్లు కండక్టర్ల తో బస్సులు అధికారులు నడిపించటానికి ప్రయత్నిస్తున్నారు ఒక్కో బస్సుకు రూ నాలుగు వేల నుంచి ఐదు వేల దాకా ప్రయాణికుల నుంచి వసూలు చేసి ఇవ్వాలని అధికారులు నిబంధనలు పెట్టారని కొందరు వ్యక్తులు వాపోతున్నారు డబ్బులు ఇవ్వకపోతే మేము ఎక్కడ నుంచి తీసుకువస్తామని వారు పేర్కొంటున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.