ETV Bharat / state

సుప్రీం తీర్పు అమలయ్యేలా చూడాలని సీజేఐకి టీఎస్​ యూటీఎఫ్​ వినతి - TS UTF requests justice nv ramana about supreme verdict implementation

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణను టీఎస్​ యూటీఎఫ్​ ప్రతినిధులు రాజ్​భవన్​లో కలిశారు. సీజేఐగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నగరానికి వచ్చిన జస్టిస్​కు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో సుప్రీం తీర్పునకు అనుగుణంగా కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయించాలని వినతిపత్రం సమర్పించారు.

ts utf met justice nv ramana
జస్టిస్​ రమణను కలిసిన టీఎస్​ యూటీఎఫ్​
author img

By

Published : Jun 16, 2021, 8:01 PM IST

సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలో కనీస వేతనాలు అమలు చేయించాలని సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్​(టీఎస్​యూటీఎఫ్​) విజ్ఞప్తి చేసింది. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల కేసును సత్వరమే పరిష్కరించాలని కోరింది. తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని.. 2016 అక్టోబర్ 26న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో అమలు జరిపించాలని యూటీఎఫ్​ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు జస్టిస్​ రమణకు వినతిపత్రం సమర్పించారు. రాజ్​భవన్​లో జస్టిస్​ రమణను టీఎస్​ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, కోశాధికారి టి. లక్ష్మారెడ్డి, నాయకులు ఆర్.శారద, పి.మాణిక్ రెడ్డి, ఆవారి శ్రీనివాస్​ కలిశారు. ముందుగా సీజేఐగా నియమితులైనందుకు సీజేఐకు శుబాకాంక్షలు తెలియజేశారు.

కనీస వేతనాలు లేవు

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత సమగ్ర శిక్ష పథకంలో 25 వేల మంది, వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 1,50,000 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారని యూటీఎఫ్​ ప్రతినిధులు తెలిపారు. వీరికి ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయటం లేదని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర మొదటి వేతన సవరణ సంఘం నివేదికలో రెగ్యులర్ ఉద్యోగుల మూల వేతనాలు 60 శాతానికి పైగా పెరగగా, కాంట్రాక్టు ఉద్యోగులకు 30శాతం పెంచేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. దీంతో రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో అంతరం మరింతగా పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సీజేఐ జోక్యం చేసుకొని సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా.. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రంలో అమలయ్యేలా చూడాలని కోరారు.

జస్టిస్​ హామీ

సుప్రీం తీర్పును అమలు జరిపేలా రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే సూచన చేస్తామని జస్టిస్​ రమణ చెప్పారని యూటీఎఫ్​ ప్రతినిధులు చెప్పారు. ఏకీకృత సర్వీసు నిబంధనల కేసును సైతం వీలైనంత త్వరగా పరిష్కరించేలా సీజేఐ హామీ ఇచ్చారని తెలిపారు.

ఇదీ చదవండి: BHARAT BIOTECH: లేగదూడ సీరం వాడారనే ఆరోపణల్లో వాస్తవం లేదు..

సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలో కనీస వేతనాలు అమలు చేయించాలని సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్​(టీఎస్​యూటీఎఫ్​) విజ్ఞప్తి చేసింది. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల కేసును సత్వరమే పరిష్కరించాలని కోరింది. తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని.. 2016 అక్టోబర్ 26న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో అమలు జరిపించాలని యూటీఎఫ్​ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు జస్టిస్​ రమణకు వినతిపత్రం సమర్పించారు. రాజ్​భవన్​లో జస్టిస్​ రమణను టీఎస్​ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, కోశాధికారి టి. లక్ష్మారెడ్డి, నాయకులు ఆర్.శారద, పి.మాణిక్ రెడ్డి, ఆవారి శ్రీనివాస్​ కలిశారు. ముందుగా సీజేఐగా నియమితులైనందుకు సీజేఐకు శుబాకాంక్షలు తెలియజేశారు.

కనీస వేతనాలు లేవు

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత సమగ్ర శిక్ష పథకంలో 25 వేల మంది, వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 1,50,000 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారని యూటీఎఫ్​ ప్రతినిధులు తెలిపారు. వీరికి ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయటం లేదని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర మొదటి వేతన సవరణ సంఘం నివేదికలో రెగ్యులర్ ఉద్యోగుల మూల వేతనాలు 60 శాతానికి పైగా పెరగగా, కాంట్రాక్టు ఉద్యోగులకు 30శాతం పెంచేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. దీంతో రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో అంతరం మరింతగా పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సీజేఐ జోక్యం చేసుకొని సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా.. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రంలో అమలయ్యేలా చూడాలని కోరారు.

జస్టిస్​ హామీ

సుప్రీం తీర్పును అమలు జరిపేలా రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే సూచన చేస్తామని జస్టిస్​ రమణ చెప్పారని యూటీఎఫ్​ ప్రతినిధులు చెప్పారు. ఏకీకృత సర్వీసు నిబంధనల కేసును సైతం వీలైనంత త్వరగా పరిష్కరించేలా సీజేఐ హామీ ఇచ్చారని తెలిపారు.

ఇదీ చదవండి: BHARAT BIOTECH: లేగదూడ సీరం వాడారనే ఆరోపణల్లో వాస్తవం లేదు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.