దేశంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి భాజపా పాలన సాగిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా విమర్శించారు. మోదీని ఓడించి.. రాహుల్ గాంధీని ప్రధానిగా ఎన్నుకునేందుకు యావత్ దేశం ఎదురుచూస్తోందని తెలిపారు.
నేడు నాగర్కర్నూల్, మహబూబ్నగర్, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాలపై చర్చించనున్నారు. రేపు చేవెళ్ల, మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్ అభ్యర్థులతో సమీక్ష నిర్వహించనున్నారు.