ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@7PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Jul 9, 2020, 6:57 PM IST

top ten news for 7pm
టాప్​టెన్​ న్యూస్​@7PM

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులంతా ఉత్తీర్ణులేనని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పైసల కోసం బతికున్న మనిషిని చంపేశారు!

కరోనాతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరితే బిల్లు పేరుతో వేధిస్తున్నారనే వార్తలు హల్​చల్ చేస్తున్నాయి. ఈ సమయంలోనే మరో వార్త తెరమీదకొచ్చింది. పైసల కోసం ఏకంగా బతికున్న వ్యక్తినే చనిపోయాడని చెప్పారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ఇంటి చికిత్సతోనే కరోనా మాయం!

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎవరికి వైరస్‌ సోకిందో ఎవరికి సోకలేదో తెలియడం లేదు. ఆరోగ్యంగా ఉన్నవారికి లక్షణాలు బయట పడటం లేదు. ఇక సీజన్ మారడం వల్ల సాధారణంగా వచ్చే జ్వరం.. జలుబు, దగ్గు వంటి లక్షణాలకే కంగారు పడాల్సిన పరిస్థితి నెలకొంది. లక్షణాలు లేనివారు పాజిటివ్‌ వచ్చినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

వెనక్కి వెళ్లిన చైనా బలగాలు

సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు శుక్రవారం మళ్లీ చర్చలు జరపనున్నాయి భారత్​, చైనా. ఇరు దేశాల పరస్పర అంగీకారం మేరకు తూర్పు లద్దాఖ్​లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించనున్నాయి. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

సామాజిక వ్యాప్తి లేదు

భారత్​లో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్​ మరోమారు స్పష్టం చేసింది. వైరస్​ నుంచి కోలుకుంటున్న వారి శాతం 62కు పెరిగినట్లు తెలిపింది. కరోనా బాధితుల సన్నిహితులకే వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

8 రాష్ట్రాల్లోనే 90 శాతం కరోనా కేసులు

దేశంలో యాక్టివ్‌ కరోనా కేసుల్లో 90 శాతం 8 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మరణాల్లో 86 శాతం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే సంభవించాయి. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

నేపాల్​ అధికార పార్టీలో చీలిక తప్పదా?

నేపాల్​ అధికార కమ్యూనిస్టు పార్టీలో విభేదాలు... పార్టీలో చీలికకు దారీ తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వివాద పరిష్కారానికి ప్రధాని కేపీ శర్మ ఓలి, నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు ప్రచండ ఇప్పటికే ఆరుసార్లు భేటీ అయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

బంగారం ధర పైపైకి

బంగారం, వెండి ధరలు గురువారం కూడా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.232 పెరిగింది. వెండి ధర కిలో రూ.53 వేలకు చేరువైంది. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'పృథ్వీ షా హ్వాగ్​ను మరిపిస్తాడు'

టీమ్​ఇండియా యువ ఆటగాళ్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్​ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు మాజీ క్రికెటర్​ వసీం జాఫర్​. పృథ్వీ తన షాట్లతో సెహ్వాగ్​ను మరిపిస్తాయని తెలిపాడు. ఈ ఇద్దరి ఆటగాళ్లకు అద్భుతమైన ప్రతిభ ఉన్నా కొన్నిసార్లు విఫలమవుతున్నారని వెల్లడించాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

సల్మాన్​, సంజయ్​లపై కేసు కొట్టివేత

కథానాయకుడు సుశాంత్ ఆత్మహత్య విషయమై వేసిన పిటిషన్​ను బిహార్​ కోర్టు కొట్టేసింది. ఈ అంశం తమ పరిధిలోకి రాదని పేర్కొంది. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి. ​

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులంతా ఉత్తీర్ణులేనని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పైసల కోసం బతికున్న మనిషిని చంపేశారు!

కరోనాతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరితే బిల్లు పేరుతో వేధిస్తున్నారనే వార్తలు హల్​చల్ చేస్తున్నాయి. ఈ సమయంలోనే మరో వార్త తెరమీదకొచ్చింది. పైసల కోసం ఏకంగా బతికున్న వ్యక్తినే చనిపోయాడని చెప్పారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ఇంటి చికిత్సతోనే కరోనా మాయం!

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎవరికి వైరస్‌ సోకిందో ఎవరికి సోకలేదో తెలియడం లేదు. ఆరోగ్యంగా ఉన్నవారికి లక్షణాలు బయట పడటం లేదు. ఇక సీజన్ మారడం వల్ల సాధారణంగా వచ్చే జ్వరం.. జలుబు, దగ్గు వంటి లక్షణాలకే కంగారు పడాల్సిన పరిస్థితి నెలకొంది. లక్షణాలు లేనివారు పాజిటివ్‌ వచ్చినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

వెనక్కి వెళ్లిన చైనా బలగాలు

సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు శుక్రవారం మళ్లీ చర్చలు జరపనున్నాయి భారత్​, చైనా. ఇరు దేశాల పరస్పర అంగీకారం మేరకు తూర్పు లద్దాఖ్​లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించనున్నాయి. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

సామాజిక వ్యాప్తి లేదు

భారత్​లో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్​ మరోమారు స్పష్టం చేసింది. వైరస్​ నుంచి కోలుకుంటున్న వారి శాతం 62కు పెరిగినట్లు తెలిపింది. కరోనా బాధితుల సన్నిహితులకే వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

8 రాష్ట్రాల్లోనే 90 శాతం కరోనా కేసులు

దేశంలో యాక్టివ్‌ కరోనా కేసుల్లో 90 శాతం 8 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మరణాల్లో 86 శాతం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే సంభవించాయి. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

నేపాల్​ అధికార పార్టీలో చీలిక తప్పదా?

నేపాల్​ అధికార కమ్యూనిస్టు పార్టీలో విభేదాలు... పార్టీలో చీలికకు దారీ తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వివాద పరిష్కారానికి ప్రధాని కేపీ శర్మ ఓలి, నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు ప్రచండ ఇప్పటికే ఆరుసార్లు భేటీ అయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

బంగారం ధర పైపైకి

బంగారం, వెండి ధరలు గురువారం కూడా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.232 పెరిగింది. వెండి ధర కిలో రూ.53 వేలకు చేరువైంది. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'పృథ్వీ షా హ్వాగ్​ను మరిపిస్తాడు'

టీమ్​ఇండియా యువ ఆటగాళ్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్​ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు మాజీ క్రికెటర్​ వసీం జాఫర్​. పృథ్వీ తన షాట్లతో సెహ్వాగ్​ను మరిపిస్తాయని తెలిపాడు. ఈ ఇద్దరి ఆటగాళ్లకు అద్భుతమైన ప్రతిభ ఉన్నా కొన్నిసార్లు విఫలమవుతున్నారని వెల్లడించాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

సల్మాన్​, సంజయ్​లపై కేసు కొట్టివేత

కథానాయకుడు సుశాంత్ ఆత్మహత్య విషయమై వేసిన పిటిషన్​ను బిహార్​ కోర్టు కొట్టేసింది. ఈ అంశం తమ పరిధిలోకి రాదని పేర్కొంది. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి. ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.