'కేసీఆర్ వల్లే ఉపద్రవం'
సీఎం కేసీఆర్ అనాలోచిత వైఖరితోనే రాష్ట్రంలో కరోనా ఉపద్రవం ముంచుకొచ్చిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. జూమ్ యాప్ ద్వారా జిల్లా అధ్యక్షులతో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ధాన్యం బస్తాల్లో ఇసుక
ధాన్యం లారీలో వడ్లకు బదులుగా నూకలు, ఇసుక కలిపి మోసానికి యత్నించారు కొందరు నిర్వాహకులు. రైసు మిల్లు వద్ద లోడు దించుతుండగా ఈ మోసం బయటపడింది. కరీంనగర్ జిల్లా పోరండ్లలోని రైసు మిల్లు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
మిరపకాయలు తెంచడానికి వెళ్లిన కూలీలపై పిడుగు పడింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రూ.2 కోట్ల కొలువు..
హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థినికి అమెరికాలో రూ. 2 కోట్ల వార్షిక వేతనంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం లభించింది. ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంపికైన 300 మందిలో.. తెలుగు తేజానికే అత్యధిక వేతనం లభించడం హర్షణీయం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాక్డౌన్ పొడిగింపు
కరోనా వ్యాప్తి అదుపులో లేనందున దిల్లీలో లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. దిల్లీ బాటలోనే హరియాణా, జమ్ముకశ్మీర్లు నడుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తగ్గిన పాజిటివిటీ రేటు
దేశంలో పాజిటివిటీ రేటు 16.98 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు 14.66 శాతంగా ఉన్నాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
భీకరమైన దాడి..
గాజాపై ఇజ్రాయెల్ బలగాలు ఆదివారం జరిపిన దాడుల్లో 23 మంది మృతి చెందారు. మరో 50 మంది వరకు గాయపడ్డారు. 3 భవనాలు కుప్పకూలాయి. ఇప్పటివరకు ఇరు పక్షాల మధ్య జరిగిన దాడుల్లో ఇదే అత్యంత భీకరమైన దాడిగా అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అవే కీలకం!
స్టాక్ మార్కెట్లకు ఈ వారం కరోనా కేసులు, వ్యాక్సినేషన్ వార్తలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు దిశా నిర్దేశం చేయనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల కదలికలపైనా మదుపరులు దృష్టి సారించే వీలుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
'తీవ్రంగా శ్రమిస్తున్నా'
భారత జట్టు అద్భుతాలు చేయగలదని టెస్టు బ్యాట్స్మన్ హనుమ విహారి అన్నాడు. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జాతిరత్నం సర్ప్రైజ్
తనను ట్యాగ్ చేసిన ట్వీట్ పెట్టిన ఓ నెటిజన్ను సర్ప్రైజ్ చేశారు జాతిరత్నాలు ఫేమ్ నవన్ పొలిశెట్టి. ఇంతకీ ఏంటా సర్ప్రైజ్? నవీన్ నెటిజన్కు ఫోన్ చేయడానికి కారణమేంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.