ETV Bharat / state

ఒకప్పటి వరప్రదాయిని మూసీకి ఇప్పుడేమైంది? - మురికి @ మూసీనది

భాగ్యనగరం నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో భయంకరమైన కాలుష్యాన్ని నింపుకొని ప్రవహిస్తున్న మూసీ కల్లోలం సృష్టిస్తోంది. తాగే నీరు, పీల్చే గాలి, తినే తిండి కూడా కలుషితమౌతోంది. నాడు పాతిక రకాలకుపైగా చేపలు దొరికే మూసీలో జలచరాలు జీవనమే కనాకష్టంగా మారింది. ఇక్కడి రైతులు పంటలు పండించలేని పరిస్థితి. పండిన పంటలు తినలేని దుస్థితి. పాలిచ్చే పాడిపశువులు కూడా మూసీ కాలుష్యకోరల్లో చిక్కుకుని అల్లాడుతున్నాయి. పరీవాహక ప్రాంతంలోని పదుల సంఖ్యలో గ్రామాలు పెను ప్రమాదంలో పడ్డాయి. అయినా ఆ మట్టితో అనుబంధం తెంచుకోలేక.... కలో, గంజో అంటూ కాలం వెల్లదీస్తున్నారు.

to much of pollution release from moosi river
మురికి @ మూసీనది
author img

By

Published : Dec 18, 2019, 11:49 AM IST

ఒకప్పుడు నగరానికి వరప్రదాయినిగా భావించిన మూసీ నది... ప్రస్తుతం ఎన్నో గ్రామాలకు దుఃఖదాయినిగా మారింది. కలుషిత జలాలు కేవలం మూసీనదికే పరిమితం కాలేదు. ఆ కాలుష్య జలాలు భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి, కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు నాశనమౌతున్నాయి. పదుల సంఖ్యలో పరిసర గ్రామాలు సర్వనాశనమవుతున్నాయి. 48 గ్రామాల్లో బోరుబావులు, చేతిపంపులు, ఇతర నివాస బోర్లలో ఆర్సినిక్, నైట్రేట్, కోబాల్డ్, కాడ్మియం, నికిల్, యురేనియం వంటి ప్రమాదకర లోహాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.


రాళ్లపైనా మురికే...


మూసీలో ఎక్కడ చూసినా బండరాళ్లపై కాలుష్యపు మరకలు కనిపిస్తున్నాయి. అవన్నీ ఎరుపు రంగుకు మారిపోయి ఉంటాయి. మూసీకి రెండు వైపులా సుమారు 5 కిలోమీటర్ల మేర కాలుష్య ప్రభావం కన్పిస్తోంది. 3 కిలోమీటర్ల పరిధిలో అయితే... తీవ్రత మరింత అధికంగా ఉంటోంది. ప్రమాదకర రసాయనాలు, లోహాలతో నిండిపోయిన భూగర్భ నీటిని వినియోగించడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఆకుకూరలు ఆ నీటితోనే...


మూసీ జలాలనే దిగువనున్న రైతులు సాగుకు వినియోగిస్తున్నారు. వరితోపాటు తోటకూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా, మెంతికూర వంటి ఆకుకూరలు పండిస్తున్నారు. మూసీ ఒడ్డున ఉండే భూముల్లో బోర్లు వేసి ఆ కాలుష్య జలాలతోనే సాగు చేస్తున్నారు. ఆ నీటితో పెరిగిన ఆకుకూరల్లో రసాయన అవశేషాలు ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు స్వయంగా వ్యవసాయ శాఖ ఓ పరిశోధనలో బయటపెట్టింది.


విధిలేక...


కత్వాల నుంచి కాలువల్లో చేరే మురుగునీటినే రైతులు తమ పంటపొలాలకు వాడుతున్నారు. దుక్కి దున్నడం నుంచి పంట చేతికొచ్చే వరకు ఆ నీరే ఆధారం కావడంతో విధి లేక పండిస్తున్నారు. కలుషిత జలాల వల్ల వరి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. 30 నుంచి 40 శాతం తాలు గింజలే ఉంటున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆర్థికంగా చితికి పోతున్నారు. కొందరు రైతులు భూములను వ్యాపారులకు అప్పగించి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. ఫలితంగా నది ఒడ్డును ఆనుకుని కొత్తకొత్త కాలనీలు వెలుస్తున్నాయి.


గరళ క్షీరం


మూసీ చుట్టూ అధికశాతం గడ్డి భూములున్నాయి. మూసీ గడ్డికి విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే ఇక్కడ పెద్దఎత్తున గడ్డి వ్యాపారం సాగుతోంది. ఒక డీసీఎం గడ్డి 30 వేల ధర పలుకుతోంది. నగర పరిసరాల్లోని పాల డెయిరీలు ఈ గడ్డిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ గడ్డి తిన్న గేదెల పాలు నగరవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. వాటిలో కూడా రసాయన అవశేషాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు.


అందుకే జ్వరాలు


హైకోర్టు న్యాయమూర్తులనే బెంబేలెత్తించిన దోమల బెడద... దిగువన గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మందులు వాడినా వాటిని నియంత్రించలేని పరిస్థితి నెలకొంది. డెంగీ, మలేరియా, గన్యా వంటి జ్వరాలు దాడి చేస్తున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు జ్వరాల భారినా పడ్డారు.

కలుషిత జలాలు మూసీ ఒడ్డున కల్లోలం సృష్టిస్తుంటే ఆ జలాలనే కొందరు వ్యాపారంగా మలుచుకుంటున్నారు. బోర్ల వద్ద ట్యాంకర్ల యజమానులు 100 రూపాయలకు నీటిని తీసుకెళ్ళి, సమీప ప్రాంతాల్లో 500 నుంచి 700 రూపాయల వరకు విక్రయించి కలుషిత నీటిని సైతం సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చూడండి: మూసీతో బతుకు మసిపై... కదిలిన హైకోర్టు

ఒకప్పుడు నగరానికి వరప్రదాయినిగా భావించిన మూసీ నది... ప్రస్తుతం ఎన్నో గ్రామాలకు దుఃఖదాయినిగా మారింది. కలుషిత జలాలు కేవలం మూసీనదికే పరిమితం కాలేదు. ఆ కాలుష్య జలాలు భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి, కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు నాశనమౌతున్నాయి. పదుల సంఖ్యలో పరిసర గ్రామాలు సర్వనాశనమవుతున్నాయి. 48 గ్రామాల్లో బోరుబావులు, చేతిపంపులు, ఇతర నివాస బోర్లలో ఆర్సినిక్, నైట్రేట్, కోబాల్డ్, కాడ్మియం, నికిల్, యురేనియం వంటి ప్రమాదకర లోహాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.


రాళ్లపైనా మురికే...


మూసీలో ఎక్కడ చూసినా బండరాళ్లపై కాలుష్యపు మరకలు కనిపిస్తున్నాయి. అవన్నీ ఎరుపు రంగుకు మారిపోయి ఉంటాయి. మూసీకి రెండు వైపులా సుమారు 5 కిలోమీటర్ల మేర కాలుష్య ప్రభావం కన్పిస్తోంది. 3 కిలోమీటర్ల పరిధిలో అయితే... తీవ్రత మరింత అధికంగా ఉంటోంది. ప్రమాదకర రసాయనాలు, లోహాలతో నిండిపోయిన భూగర్భ నీటిని వినియోగించడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఆకుకూరలు ఆ నీటితోనే...


మూసీ జలాలనే దిగువనున్న రైతులు సాగుకు వినియోగిస్తున్నారు. వరితోపాటు తోటకూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా, మెంతికూర వంటి ఆకుకూరలు పండిస్తున్నారు. మూసీ ఒడ్డున ఉండే భూముల్లో బోర్లు వేసి ఆ కాలుష్య జలాలతోనే సాగు చేస్తున్నారు. ఆ నీటితో పెరిగిన ఆకుకూరల్లో రసాయన అవశేషాలు ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు స్వయంగా వ్యవసాయ శాఖ ఓ పరిశోధనలో బయటపెట్టింది.


విధిలేక...


కత్వాల నుంచి కాలువల్లో చేరే మురుగునీటినే రైతులు తమ పంటపొలాలకు వాడుతున్నారు. దుక్కి దున్నడం నుంచి పంట చేతికొచ్చే వరకు ఆ నీరే ఆధారం కావడంతో విధి లేక పండిస్తున్నారు. కలుషిత జలాల వల్ల వరి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. 30 నుంచి 40 శాతం తాలు గింజలే ఉంటున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆర్థికంగా చితికి పోతున్నారు. కొందరు రైతులు భూములను వ్యాపారులకు అప్పగించి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. ఫలితంగా నది ఒడ్డును ఆనుకుని కొత్తకొత్త కాలనీలు వెలుస్తున్నాయి.


గరళ క్షీరం


మూసీ చుట్టూ అధికశాతం గడ్డి భూములున్నాయి. మూసీ గడ్డికి విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే ఇక్కడ పెద్దఎత్తున గడ్డి వ్యాపారం సాగుతోంది. ఒక డీసీఎం గడ్డి 30 వేల ధర పలుకుతోంది. నగర పరిసరాల్లోని పాల డెయిరీలు ఈ గడ్డిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ గడ్డి తిన్న గేదెల పాలు నగరవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. వాటిలో కూడా రసాయన అవశేషాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు.


అందుకే జ్వరాలు


హైకోర్టు న్యాయమూర్తులనే బెంబేలెత్తించిన దోమల బెడద... దిగువన గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మందులు వాడినా వాటిని నియంత్రించలేని పరిస్థితి నెలకొంది. డెంగీ, మలేరియా, గన్యా వంటి జ్వరాలు దాడి చేస్తున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు జ్వరాల భారినా పడ్డారు.

కలుషిత జలాలు మూసీ ఒడ్డున కల్లోలం సృష్టిస్తుంటే ఆ జలాలనే కొందరు వ్యాపారంగా మలుచుకుంటున్నారు. బోర్ల వద్ద ట్యాంకర్ల యజమానులు 100 రూపాయలకు నీటిని తీసుకెళ్ళి, సమీప ప్రాంతాల్లో 500 నుంచి 700 రూపాయల వరకు విక్రయించి కలుషిత నీటిని సైతం సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చూడండి: మూసీతో బతుకు మసిపై... కదిలిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.