విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ సంఖ్యలో విదేశాల నుంచి ప్రయాణించి వచ్చిన వారు ఉండటంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించింది. ప్రత్యేక బృందాలతో విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి... 14 రోజుల పాటు పూర్తిగా క్వారంటైన్లో ఉంచాలని ఆదేశించింది. ఈ రోజుల్లో వారిని సర్వైలెన్స్ బృందాలు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పరిశీలించాలని స్పష్టం చేసింది.
హోమ్ క్వారంటైన్లో ఉన్న వ్యక్తులకు స్టాంపింగ్, ఇళ్లకు స్టికర్లు వేయాలని తెలిపింది. హోమ్ క్వారంటైన్కు సంబంధించి ఇరుగుపొరుగు వారు, కాలనీ సంక్షేమ సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. కరోనా లక్షణాలు ఏమాత్రం కనిపించినా వెంటనే ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని... పాజిటివ్ కేసుల సంబంధీకులు అందరినీ గుర్తించి పూర్తిస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు.
హోమ్ క్వారంటైన్కు సంబంధించి ఇరుగుపొరుగు, కాలనీ సంక్షేమ సంఘాలకు సమాచారం అందించాలని పేర్కొంది. పాజిటివ్ కేసుల సంబంధీకులను గుర్తించి పర్యవేక్షించాలని తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. హైదరాబాద్ పరిధిలోని సిబ్బంది, వైద్యాధికారులు జీహెచ్ఎసీ కమిషనర్ కిందే పనిచేయాలని పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి: ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ మార్గదర్శకాలివే...