ETV Bharat / state

ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని చెరువులు, నీటి వనరుల్లో చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మత్స్య పిల్లల సేకరణ, పంపిణీకి సంబంధించి టెండర్​ ప్రక్రియ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రన్​ ఉత్తర్వులు జారీ చేశారు.

author img

By

Published : Jul 17, 2020, 9:40 AM IST

The government is preparing for the distribution of free fish fry
ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు

రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలో రాష్ట్రంలోకి ప్రవేశించడం వల్ల వానలు ఆశాజనంగా కురుస్తున్నాయి. సాగు నీటి ప్రాజెక్టులు, చెరువులు, ఇతర నీటి వనరుల్లోకి నీరు వచ్చి చేరుతుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువులు, నీటి వనరుల్లో చేప పిల్లలు ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది రొయ్యల సాగు సైతం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రొయ్య పిల్లల సేకరణ, పంపిణీకి సంబంధించి టెండర్ ప్రక్రియ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. టెండర్ కమిటీ ఛైర్మన్‌గా మత్స్య శాఖ కమిషనర్ వ్యవహరిస్తారు. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రన్ ఉత్తర్వలు జారీ చేశారు.

రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలో రాష్ట్రంలోకి ప్రవేశించడం వల్ల వానలు ఆశాజనంగా కురుస్తున్నాయి. సాగు నీటి ప్రాజెక్టులు, చెరువులు, ఇతర నీటి వనరుల్లోకి నీరు వచ్చి చేరుతుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువులు, నీటి వనరుల్లో చేప పిల్లలు ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది రొయ్యల సాగు సైతం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రొయ్య పిల్లల సేకరణ, పంపిణీకి సంబంధించి టెండర్ ప్రక్రియ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. టెండర్ కమిటీ ఛైర్మన్‌గా మత్స్య శాఖ కమిషనర్ వ్యవహరిస్తారు. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రన్ ఉత్తర్వలు జారీ చేశారు.

ఇదీచూడండి: ప్రభుత్వ విద్య బలోపేతం.. వ్యవస్థల ప్రక్షాళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.