ETV Bharat / state

బెంగళూరు నుంచి కర్నూలుకు మొదటి విమానం

author img

By

Published : Jan 31, 2021, 11:55 AM IST

బెంగళూరు నుంచి ఏపీ, కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి విమాన సర్వీసు నడవనుంది. మార్చి 28 నుంచి ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి.

the-first-flight-from-bangalore-to-kurnool
బెంగళూరు నుంచి కర్నూలుకు మొదటి విమానం

బెంగళూరు నుంచి ఏపీ, కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి విమాన సర్వీసు నడవనుంది. మార్చి 28నుంచి ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. కర్నూలు నుంచి విశాఖపట్నం, చెన్నైకు విమాన సర్వీసుల రాకపోకల షెడ్యూల్‌ను ఇండిగో సంస్థ విడుదల చేసింది. ఫిబ్రవరి 15నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలను ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉదయం 9:05గంటలకు.. విమానం బెంగళూరులో బయల్దేరి కర్నూలు చేరుకుంటుంది. అదే రోజుల్లో మధ్యాహ్నం 3:15గంటలకు కర్నూలు నుంచి బయల్దేరి బెంగళూరు వెళ్తుంది. అలాగే ఉదయం 10:30గంటలకు కర్నూలు నుంచి బయల్దేరి విశాఖపట్నం వెళ్తుంది. మధ్యాహ్నం 1:00గంటకు విశాఖపట్నం నుంచి బయల్దేరి కర్నూలుకు వస్తుంది.

ప్రతి మంగళ, గురు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 2:50గంటలకు చెన్నై నుంచి బయల్దేరి కర్నూలుకు, సాయంత్రం 4:30గంటలకు కర్నూలు నుంచి బయల్దేరి చెన్నైకి వెళ్లనున్నట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది.

కర్నూలు నుంచి బెంగళూరుకు రూ.2,077, కర్నూలు నుంచి చెన్నైకి రూ.3,144, కర్నూలు నుంచి విశాఖపట్నానికి రూ.2,463గా ప్రాథమిక ధరలను నిర్ణయిస్తూ ప్రకటన విడుదల చేసింది.

ఇదీ చదవండి: గల్లీ క్రికెట్​ ఆడిన జాన్వీ.. అభిమానులు ఫిదా

బెంగళూరు నుంచి ఏపీ, కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి విమాన సర్వీసు నడవనుంది. మార్చి 28నుంచి ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. కర్నూలు నుంచి విశాఖపట్నం, చెన్నైకు విమాన సర్వీసుల రాకపోకల షెడ్యూల్‌ను ఇండిగో సంస్థ విడుదల చేసింది. ఫిబ్రవరి 15నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలను ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉదయం 9:05గంటలకు.. విమానం బెంగళూరులో బయల్దేరి కర్నూలు చేరుకుంటుంది. అదే రోజుల్లో మధ్యాహ్నం 3:15గంటలకు కర్నూలు నుంచి బయల్దేరి బెంగళూరు వెళ్తుంది. అలాగే ఉదయం 10:30గంటలకు కర్నూలు నుంచి బయల్దేరి విశాఖపట్నం వెళ్తుంది. మధ్యాహ్నం 1:00గంటకు విశాఖపట్నం నుంచి బయల్దేరి కర్నూలుకు వస్తుంది.

ప్రతి మంగళ, గురు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 2:50గంటలకు చెన్నై నుంచి బయల్దేరి కర్నూలుకు, సాయంత్రం 4:30గంటలకు కర్నూలు నుంచి బయల్దేరి చెన్నైకి వెళ్లనున్నట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది.

కర్నూలు నుంచి బెంగళూరుకు రూ.2,077, కర్నూలు నుంచి చెన్నైకి రూ.3,144, కర్నూలు నుంచి విశాఖపట్నానికి రూ.2,463గా ప్రాథమిక ధరలను నిర్ణయిస్తూ ప్రకటన విడుదల చేసింది.

ఇదీ చదవండి: గల్లీ క్రికెట్​ ఆడిన జాన్వీ.. అభిమానులు ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.